News February 8, 2025
దిలావర్పూర్: ఆయిల్ ఫామ్తో రైతులకు లాభసాటి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738931595590_51993896-normal-WIFI.webp)
ఆయిల్ ఫామ్ మొక్కలను నాటుకోవడంతో రైతులకు లాభదాయకంగా ఉంటుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి వి. రమణ అన్నారు. దిలావర్పూర్ మండలంలో ఆయా రైతులు నాటిన తోటలను సందర్శించారు. అనంతరం రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలపై రాయితీ వివరాలు తెలిపారు. మొక్కలు నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను పేర్కొన్నారు. ఇందులో డివిజన్ మేనేజర్ శేఖర్, క్లస్టర్ ఆఫీసర్ ప్రశాంత్, రైతులు ఉన్నారు.
Similar News
News February 8, 2025
17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738988566435_710-normal-WIFI.webp)
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్కు 10న ఒక్క రోజే గడువు ఉంది.
News February 8, 2025
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా కథ ఇదేనా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738987098262_1045-normal-WIFI.webp)
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోడి రామ్మూర్తి జీవిత కథ ఆధారంగా తీస్తున్నారని తొలుత ప్రచారం నడిచింది. అయితే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా కథ గురించి హింట్ ఇచ్చారు. ‘రాత్రుళ్లు షూటింగ్, ఫ్లడ్ లైట్లు, పవర్ క్రికెట్, విచిత్రమైన కోణాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో రెండు ఊళ్ల మధ్య జరిగే క్రికెట్ ఆధారంగా మూవీ కథ ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
News February 8, 2025
సంగారెడ్డి: 10th ఎఫ్ఏ మార్కుల రికార్డుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738984022706_52434823-normal-WIFI.webp)
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఎఫ్ఏ మార్కుల రికార్డుల పరిశీలనకు పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీ వరకు అన్ని పాఠశాలలను సందర్శించి రికార్డుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సుమారుగా 70 పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.