News November 15, 2024

దిలావర్పూర్: ఒకే గ్రామం నుంచి ఐదుగురికి ఉద్యోగాలు

image

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలానికి చెందిన ఐదుగురు గ్రూప్-4లో ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన కాలేరి మధు (ట్రైజరీ), కుంట రుచిత (ఇంటర్ విద్యా), బొల్ల గంగాధర్ (మున్సిపల్), బెజ్జరాం నవీన్ కుమార్ (రెవిన్యూ) రాజారం గంగ సాగర్ (మున్సిపల్)లో జూనియర్ అసిస్టెంట్‌లుగా ఎంపికయ్యారు. వీరందరిదీ వ్యవసాయ కుటుంబాలు. కాగా వీరిని గ్రామస్థులు అభినందిస్తున్నారు.

Similar News

News October 15, 2025

సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి: ADB కలెక్టర్

image

రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 25 వరకు జరిగే విజన్-2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని సూచించారు. ఈ సర్వే లింక్‌ను, QR కోడ్‌ను తమ కార్యాలయాల్లో ప్రదర్శించడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.

News October 14, 2025

ADB: అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి

image

అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు అండగా నిలవాలని, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న
దౌర్జన్యాల పట్ల తక్షణమే స్పందించి వారికి న్యాయం చేకూర్చాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి సభ్యుల అభిప్రాయాలు స్వీకరించారు.

News October 14, 2025

ఆదిలాబాద్‌లో బంగారం రికార్డు ధర.!

image

బంగారం పేదవాడికి అందని ద్రాక్షగా మారనుందా.? అంటే వాటి గణాంకాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా పసిడి రేటు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఈరోజు మంగళవారం బంగారం ధర మార్కెట్‌లో తులానికి రూ.1,31,500 పలికి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. పసిడి రేటును చూసి సాధారణ ప్రజలు బెంబలెత్తిపోతున్నారు.