News March 21, 2025
దిలావర్పూర్: తాగునీటికోసం ‘భగీరథ’ ప్రయత్నం

గ్రామాల్లో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. వేసవి కాలంలో అడుగంటుతున్న భూగర్భ జలాలు సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఇంటింటికి నల్లా నీరు అంటూ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో ప్రయోజనం లేకుండా పోతోంది. ఇంటింటికీ భగీరథ నీరు పంపిణీ కావడం లేదు. గ్రామస్థులు మీటరు లోతు వరకు తవ్వి భగీరథ నీటిని పట్టుకుంటున్నారు. తాగు నీటికోసం ప్రజలకు ‘భగీరత’ ప్రయత్నం చేయక తప్పడం లేదు.
Similar News
News November 17, 2025
దక్షిణ చైనా సముద్రంలో బాంబర్ పెట్రోలింగ్

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇటీవల US, జపాన్లతో కలిసి ఫిలిప్పీన్స్ అక్కడ నౌకాదళ విన్యాసాలు చేపట్టింది. దీనికి కౌంటర్గా చైనా తొలిసారిగా యుద్ధ విమానాలతో బాంబర్ ఫార్మేషన్ పెట్రోలింగ్ నిర్వహించింది. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఫిలిప్పీన్స్ను హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రమంతా తమదేనని డ్రాగన్ వాదిస్తుండగా దీనికి చెక్ పెట్టేందుకే ఫిలిప్పీన్స్ విన్యాసాలు చేపట్టింది.
News November 17, 2025
PDPL: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

PDPL(D) సుల్తానాబాద్ మం.లోని చిన్నకల్వల వద్దగల రాజీవ్ రహదారిపై కారు ఢీకొన్న ఘటనలో ఇదే గ్రామానికి చెందిన రాపెళ్లి రాజేశం(72) అక్కడికక్కడే మృతిచెందాడు. SI శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశం ఇంట్లోని చెత్తను ఇంటి ముందు ఉన్న చెత్తకుండీలో వేసి వెనుకకు తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్- పెద్దపల్లివైపు అతివేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
News November 17, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> నిడిగొండలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
> కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
> మెరుగైన వైద్య సేవలు అందించాలి పాలకుర్తి ఎమ్మెల్యే
> దొడ్డి కొమురయ్య త్యాగం మరువలేనిది ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
> ఆర్ఎంపి, పిఎంపి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
> చిట్టితల్లిని ఎత్తుకొని లాలించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి


