News March 21, 2025
దిలావర్పూర్: తాగునీటికోసం ‘భగీరథ’ ప్రయత్నం

గ్రామాల్లో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. వేసవి కాలంలో అడుగంటుతున్న భూగర్భ జలాలు సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఇంటింటికి నల్లా నీరు అంటూ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో ప్రయోజనం లేకుండా పోతోంది. ఇంటింటికీ భగీరథ నీరు పంపిణీ కావడం లేదు. గ్రామస్థులు మీటరు లోతు వరకు తవ్వి భగీరథ నీటిని పట్టుకుంటున్నారు. తాగు నీటికోసం ప్రజలకు ‘భగీరత’ ప్రయత్నం చేయక తప్పడం లేదు.
Similar News
News November 13, 2025
అనుమానమే పెనుభూతం.. మహిళ హత్య కేసులో సంచలనాలు.!

విజయవాడలో పట్టపగలే భార్యను కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన <<18275922>>కలకలం రేపింది<<>>. కృష్ణా (D)నాగాయలంకకు చెందిన విజయ్, నూజివీడుకు చెందిన నర్సు సరస్వతిని 4ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఏడాది క్రితం విడిపోగా, భార్యపై అనుమానం పెంచుకున్న విజయ్ ఆమెను హత్యచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
News November 13, 2025
మహావిష్ణువు పేరును ఎందుకు స్తుతించాలి?

జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం|
స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః||
భారతంలో భీష్ముడు, ధర్మరాజుకు ఈ శ్లోకాన్ని చెప్పారు. ‘జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును వేయి నామాలతో స్తుతించిన పురుషుడికి నిత్యం శుభాలు కలుగుతాయి’ అనేది దీనర్థం. నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూ, ఆయన సేవ చేసే వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ఈ శ్లోకం వివరిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 13, 2025
తిరుపతి: 164 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు.!

EC ఆదేశాల మేరకు ప్రత్యేక ఇంటెన్సివ్ పునర్విమర్శ–2025లో భాగంగా 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి 164 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 38 కేంద్రాల ప్రాంతాల మార్పు, 9 పేర్ల మార్పు,164 కొత్త కేంద్రాల ప్రతిపాదనలతో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగిందన్నారు.


