News April 15, 2025

దిలావర్పూర్:  రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

image

యాక్సిడెంట్‌లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన మంగళవారం దిలావర్పూర్ మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నిర్మల్ భైంసా హైవేపై సిర్గాపూర్ వద్ద బైంసా వైపు నుంచి బైక్‌పై వస్తున్న ఇద్దరు మేస్త్రీలను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 21, 2025

VIRAL: సముద్రంలో ఒంటరిగా 483 రోజులు!

image

సముద్రంలో ఒంటరిగా ఒక్క రోజు గడపడమే గగనం. అలాంటిది జోస్ సాల్వడార్ అనే మత్స్యకారుడు 483 రోజులు ఒంటరిగా గడిపిన ఘటనను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 2012లో మెక్సికో తీరం నుంచి పడవలో బయలుదేరిన ఆయన తుఫానులో చిక్కుకుని 438 రోజులు పసిఫిక్ మహాసముద్రంలో గడిపారు. పచ్చి చేపలు, పక్షులు, వర్షపు నీరును తాగుతూ మనుగడ సాగించారు. బతకాలనే ఆశ బలంగా ఉంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని ఆయన నిరూపించారు.

News November 21, 2025

HMపై నంద్యాల కలెక్టర్ ఆగ్రహం

image

నంద్యాలలోని నందమూరి నగర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌ను కలెక్టర్ రాజకుమారి శుక్రవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు, విద్యార్థినులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నప్పటికీ అవి అపరిశుభ్రంగా ఉన్నాయని విద్యార్థులు కలెక్టర్‌కు వివరించారు.

News November 21, 2025

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో<<18346724>> గంటల<<>> వ్యవధిలోనే బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఉదయం స్వల్పంగా పెరగ్గా.. ఇప్పుడు రూ.500 తగ్గి రూ.1,23,980కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పతనమై రూ.1,13,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఉదయం నుంచి ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,61,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.