News April 15, 2025
దిలావర్పూర్: రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

యాక్సిడెంట్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన మంగళవారం దిలావర్పూర్ మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నిర్మల్ భైంసా హైవేపై సిర్గాపూర్ వద్ద బైంసా వైపు నుంచి బైక్పై వస్తున్న ఇద్దరు మేస్త్రీలను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 19, 2025
సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు జరగడం సంతోషం: చిరు

పుట్టపర్తిలో సత్యసాయిబాబా శతజయంతి వేడుకలపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తంచేశారు. ‘ప్రపంచానికి ఆధ్యాత్మికతను, సేవాభావాన్ని పెంపొందించి, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన తలపెట్టిన కార్యక్రమాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయన మనమధ్య లేకపోవచ్చు కానీ ఆయన స్ఫూర్తి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది. రూ.100 స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ జారీ చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అంటూ ‘X’లో పోస్టు చేశారు.
News November 19, 2025
NGKL: పూజిత చనిపోయింది.. పోలీసుల ప్రకటన

HYD ఘట్కేసర్ పరిధి అవుషాపూర్లోని <<18219517>>అనురాగ్<<>> యూనివర్సిటీలో BSC నర్సింగ్ 3rd ఇయర్ చదువుతున్న పూజిత(22) ఈనెల 6న కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె పంజాగుట్ట నిమ్స్లో 13 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చనిపోయిందని ఘట్కేసర్ పోలీసులు ఈరోజు తెలిపారు. కాగా పూజిత స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా తుమ్మలవాడ అని చెప్పారు.
News November 19, 2025
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న PM మోదీ

ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి 23 వరకు సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్నారు. 22, 23 తేదీల్లో నిర్వహించనున్న 20వ G-20 సదస్సులో ఆయన పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘G-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జొహన్నెస్బర్గ్లో పర్యటించనున్నారు. ఈ సమ్మిట్లో ప్రధాని 3 సెషన్లలో ప్రసంగిస్తారు. వివిధ నేతలతోనూ భేటీ అవుతారు. ఇది ఓ గ్లోబల్ సౌత్ దేశంలో వరుసగా నాలుగోసారి జరుగుతున్న G-20 సదస్సు’ అని పేర్కొంది.


