News February 8, 2025

దిలావార్ పూర్: విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్ల బందోబస్తు పరిశీలన

image

ఈ నెల 8న నిర్వహించనున్న ధ్యాన హనుమాన్ భారీ శిల్ప విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను అదనపు ఎస్పీలు అవినాష్ కుమార్, ఉపేందర్ రెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి వచ్చే భక్తులు వాహనాలు, సౌకర్యాలను తదితర విషయాలను కార్యక్రమా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News February 8, 2025

విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.

News February 8, 2025

కేజ్రీవాల్ వెనుకంజ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూ ఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడ్డారు. అలాగే కాల్కాజీ నుంచి బరిలో నిలిచిన ఢిల్లీ సీఎం ఆతిశీ, జంగ్‌పుర నుంచి పోటీలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ట్రయలింగ్‌లో ఉన్నారు.

News February 8, 2025

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి

image

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పట్టభద్రులు గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మోసపూరిత వాగ్దానాలకు బలయ్యారన్నారు.

error: Content is protected !!