News January 30, 2025

దిల్లీ ఎర్రకోటలో ADB జిల్లా వాసుల ప్రదర్శన

image

ఇచ్చోడ మండలం దుబాయ్ పేటకు చెందిన ఆదివాసీ కళాకారులు దిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన భారత్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభను కనబర్చారు. ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని కొమ్ము కోయ నృత్యం ప్రదర్శించామన్నారు. తమ ప్రతిభతో అందరినీ మెప్పించినట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 16, 2025

ఆదిలాబాద్‌కు చేరుకున్న మంత్రి సీత‌క్క‌

image

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి న‌రేంద‌ర్‌రెడ్డి ప్ర‌చార సభ కోసం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీత‌క్క ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీ‌నివాస‌రెడ్డి దంపతులు మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ దండే విఠ‌ల్‌, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు ఆదివారం ఘన స్వాగతం పలికారు.

News February 16, 2025

లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

image

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.

News February 16, 2025

ADB: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

image

ADB, KNR, NZB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

error: Content is protected !!