News April 8, 2025
దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ .. నేడే తీర్పు

దిల్సుఖ్నగర్లో జరిగిన జంట పేలుళ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించబోతుంది. 2013 FEB 21న జరిగిన ఈ బాంబ్ దాడిలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి NIA కోర్టు ఉరిశిక్ష వేయగా, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పేలుళ్ల ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.
Similar News
News April 17, 2025
బషీర్బాగ్: ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్

బషీర్బాగ్లోని SCERT కార్యాలయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్ జరిగింది. కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొ.హరగోపాల్, ప్రొ.శాంత సిన్హా, ప్రొ.రామ మేల్కొటి, ప్రొ.కోదండరాం తదితరులు పాల్గొని వ్యాసాలు సమర్పించారు.
News April 17, 2025
సిటీలో పెరుగుతున్న నీటి వినియోగం

HYD మహానగరంలో నీటి వినియోగం ఏటా పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ నగరం విస్తరిస్తుండటం కూడా ఓ కారణం. 2021 మార్చిలో జలమండలి 75,782 ట్యాంకర్ల నీటిని సరఫరా చేయగా, 2022 మార్చికి 83,078 ట్యాంకర్లకు పెరిగింది. 2023 మార్చిలో 1,12,679 ట్యాంకర్ల నీటిని సిటీ ప్రజలు ఉపయోగించగా 2024 మార్చి నాటికి ఆ సంఖ్య 1,69,596కు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 2,82,961 ట్యాంకర్ల సరఫరా జరిగింది.
News April 17, 2025
ONE DAY TOUR: మన అనంతగిరి ది బెస్ట్

వారంలో ఒక్కరోజైనా రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే, అనంతగిరి హిల్స్ బెస్ట్ ప్లేస్. వీకెండ్ వచ్చిందంటే చాలు HYD, కర్ణాటక నుంచి వందలాది మంది టూరిస్టులు ఇక్కడికి క్యూ కడతారు. చుట్టూ పచ్చని కొండలు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, మూసీ నది పుట్టుక ఈ అడవుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ టూర్ వెళ్లాలంటే వరుసగా లీవ్లు పెట్టే అవసరం లేదు. ఒక్కరోజులోనే అనంతగిరిని చుట్టిరావొచ్చు.
SHARE IT