News April 8, 2025
దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్.. నేడే తీర్పు

దిల్సుఖ్నగర్లో జరిగిన జంట పేలుళ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించబోతుంది. 2013 FEB 21న జరిగిన ఈ బాంబ్ దాడిలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి NIA కోర్టు ఉరిశిక్ష వేయగా, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పేలుళ్ల ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.
Similar News
News November 27, 2025
వంటింటి చిట్కాలు

* కూరల్లో పెరుగు వేసేటప్పుడు నేరుగా కలపకుండా, ఒక కప్పులో వేసి స్పూన్తో చిలికి వెయ్యాలి. అప్పుడే గ్రేవీ మొత్తానికి చిక్కదనం వస్తుంది.
* పాలు మాడకుండా ఉండాలంటే కాచే ముందు గిన్నెలో కొద్దిగా చన్నీరు పోసి వంపేయాలి.
* కిస్మిస్ నిల్వ ఉండాలంటే గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్లో పెట్టాలి. ఇలా చేస్తే నెలల తరబడి ఫ్రెష్గా ఉంటాయి.
* గుడ్లు ఉడికించేటప్పుడు కాస్త నూనె వేస్తే పగలవు.
News November 27, 2025
మెదక్: వార్డు సభ్యుల గుర్తులు ఇవే..

స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు వేరువేరుగా గుర్తులను కేటాయించనున్నారు. వార్డు సభ్యులకు 20 గుర్తులను నిర్ణయించగా ఆ గుర్తులు ఇవే. గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈలా, కుండ, డిష్ యాంటినా, గరాట, మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, కవరు, హాకీ స్టిక్, బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టే, విద్యుత్ స్తంభం, కెటిల్ ఉన్నాయి.
News November 27, 2025
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ను కలిసిన DCP

రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(DCP)గా ఇటీవల నూతనంగా నియమితులైన భూక్య రామ్రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు రామ్రెడ్డి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.


