News April 8, 2025

దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్.. నేడే తీర్పు

image

దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించబోతుంది. 2013 FEB 21న జరిగిన ఈ బాంబ్ దాడిలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి NIA కోర్టు ఉరిశిక్ష వేయగా, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పేలుళ్ల ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.

Similar News

News December 2, 2025

భద్రాద్రి: రెండో రోజు అందిన నామినేషన్ వివరాలు

image

గ్రామపంచాయతీ ఎన్నికల 2వ విడతలో 7 మండలాల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 2వ రోజు సోమవారం మండలాల వారీగా అందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ వివరాలు.. అన్నపురెడ్డిపల్లి – 8, 6, అశ్వారావుపేట – 15, 13, చండ్రుగొండ – 9, 8, చుంచుపల్లి – 14, 13, దమ్మపేట – 19, 19, ములకలపల్లి -13, 13, పాల్వంచ -22, 18, మొత్తం సర్పంచ్ 100, వార్డు సభ్యులకు 90 నామినేషన్లు వచ్చాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.

News December 2, 2025

కృష్ణా: టెన్త్ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరయల్స్

image

ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 60 వేలమందికి పైగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి వందరోజుల ప్రణాళిక అమలు చేయనున్నారు. అదే రోజు తుది పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా స్ఫూర్తి మెటీరియల్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా SCERT మరో మెటీరియల్ అందిస్తుంది. ఇందులో మోడల్ పేపర్స్ ఉంటాయి. పిల్లలు అందరూ ఒక విధంగా పరీక్షలకు సిద్ధం కావాలని మెటీరియల్ ఆదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

News December 2, 2025

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<>STPI<<>>) 24 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 12వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ స్టాఫ్, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech, MSc, M.Tech, PhD, డిప్లొమా, టెన్త్+ITI, ఇంటర్, డిగ్రీ, PG, MBAతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: stpi.in