News April 8, 2025
దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్.. నేడే తీర్పు

దిల్సుఖ్నగర్లో జరిగిన జంట పేలుళ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించబోతుంది. 2013 FEB 21న జరిగిన ఈ బాంబ్ దాడిలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి NIA కోర్టు ఉరిశిక్ష వేయగా, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పేలుళ్ల ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.
Similar News
News November 27, 2025
HYD: ‘మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

మహిళల భద్రతే తమ లక్ష్యమని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో మహిళలను వేధించిన 110 మంది వ్యక్తులను పట్టుకున్నామన్నారు. మహిళలకు ఎవరు ఇబ్బంది కలిగించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిని ఆధారాలతో కోర్టుకు హాజరు పరుస్తూ.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.
News November 27, 2025
NRPT: నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా.వినీత్ తెలిపారు. కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ చెప్పారు.
News November 27, 2025
మల్లాపూర్: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

మల్లాపూర్ మండలం గొర్రెపల్లి, సాతారం, మొగిలిపేట, రాఘవపేట, కుస్తాపూర్, కొత్త దామరాజ్ పల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను గురువారం అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ పరిశీలించారు. నోటీస్ బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలన్నారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.


