News April 7, 2025

దివ్యాంగులకు 70 ట్రై సైకిళ్లు అందించిన పొదెం వీరయ్య

image

తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ CSRలో భాగంగా ఆదివారం కొత్తగూడెం ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 70 మంది దివ్యాంగులకు మోటర్ ట్రై సైకిళ్లను అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పొదెం వీరయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అటవీ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డాక్టర్ జి. స్కైలాబ్ పాల్గొన్నారు.

Similar News

News November 26, 2025

సింహాచలం ఆలయ ప్రతిష్ఠ మసకబారింది: గంటా

image

గత వైసీపీ హయాంలో సింహాచలం దేవాలయాన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తాలూకా అవశేషాలు దేవస్థానంలో ఇంకా ఉన్నాయన్నారు. ఉద్యోగ వ్యవహారాలు, విరాళాలు, బంగారు ఆభరణాల లెక్కలు.. ఇలా అనేక అంశాల్లో వస్తున్న ఆరోపణలు ఆలయ ప్రతిష్ఠను మసక బారుస్తున్నాయని అన్నారు.

News November 26, 2025

సర్పంచ్ ఎన్నికల కోసం మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా డిసెంబర్‌లో నిర్వహించే సర్పంచ్ ఎన్నికల కోసం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మీడియా కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్‌ఓ తిరుమల పాల్గొన్నారు.

News November 26, 2025

పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.