News October 27, 2024
దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కోయంబత్తూరు(CBE), బరౌని(BJU) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06055 CBE- BJU ట్రైన్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 16 వరకు ప్రతి శనివారం, నం.06056 BJU- CBE ట్రైన్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 19 వరకు ప్రతిమంగళవారం నడుస్తాయన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News October 18, 2025
తాడిగడపకు పాత పేరు ఖరారు

గత వైసీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ’గా నామకరణం చేసిన పేరును మార్చాలని స్థానిక ప్రజలు కోరారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించిన అనంతరం, మున్సిపాలిటీకి ‘తాడిగడప’ అనే పాత పేరును పునరుద్ధరించాలని నిర్ణయించారు.
News October 18, 2025
అభివృద్ధి పనుల బిల్లులను తక్షణం చెల్లించండి: కలెక్టర్

వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి చేసిన పనుల బిల్లుల చెల్లింపుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ బిల్లుల చెల్లింపులపై సమీక్షించారు. పూర్తి చేసిన పనులకు సకాలంలో బిల్లులు రూపొందించి Onlineలో Uplod చేయాలని, కాంట్రాక్టర్లకు తుది బిల్లు చెల్లించేంత వరకు బాధ్యత వహించాలన్నారు.
News October 17, 2025
కృష్ణా: ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ పలువురు ఉద్యోగుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగులు విన్నవించిన వివిధ సమస్యలను ఆయన ఓపిగ్గా ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.