News January 30, 2025
దుగ్గిరాల: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుగ్గిరాల, చిలువూరు స్టేషన్ల మధ్య మంచికలపూడి రైల్వే గేటు సమీపంలో సుమారు 30 – 35 ఏళ్ల వయసున్న వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని తెనాలి జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు.
Similar News
News February 19, 2025
గుంటూరు: MDMA వినియోగిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్

MDMA నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తూ, వినియోగిస్తున్న 9 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను గుంటూరు ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన నితిన్ కాజ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయికృష్ణకు MDMA విక్రయించాడు. ఆ మత్తు పదార్థాలను సాయికృష్ణ గోరంట్లలో ఉంటూ ఇంజినీరింగ్ కళాశాలలకు విక్రయించాడు. మొత్తం 11 మంది ఉండగా 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
News February 19, 2025
గుంటూరు: ‘కారు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలి మృతి’

కారు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందిన ఘటన సంగడిగుంట లాంఛెస్టర్ రోడ్డులో చోటుచేసుకుంది. గాంధీనగర్కి చెందిన కొండమ్మ (58) విధుల్లో ఉండగా ఓ యువకుడు తన కారు కింద ఉన్న కుక్కల్ని బయపెట్టడానికి ఎక్సలేటర్ ఇచ్చాడు. అప్పటికే గేరులో ఉన్న కారు పారిశుద్ధ్య కార్మికురాలిపైకి దూసుకువెళ్లడంతో ఆమె మృతిచెందినట్లు ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కమిషనర్ శ్రీనివాసులు, కార్మిక సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి.
News February 19, 2025
ANU: BED పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం నుంచి బీ.ఫార్మసీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో 16, ప్రకాశం జిల్లాలో మూడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఈ మేరకు విశ్వవిద్యాలయం పీజీ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షల సమన్వయకర్త ఎం.సుబ్బారావు నాగార్జున వర్సిటీ ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు పరిశీలించారు.