News December 16, 2024
దుగ్గొండి: ఊరంతా ఎడ్యుకేట్సే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734313848966_930-normal-WIFI.webp)
దుగ్గొండి మండలంలోని పీజీతండాలో 120 ఇళ్లు ఉన్నాయి. అందులో 540 జనాభా ఉండగా ప్రతి ఇంటికి ఒక ఎడ్యుకేట్ ఉన్నారు. 80 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, సీఐలు, ఎస్సైలు, ఏఈలు ఇలా పలు ప్రభుత్వశాఖల్లో వారు ఉద్యోగాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఎన్నారైలు ఉన్నారు. దీంతో ఆగ్రామానికి పీజీతండా అని పేరు వచ్చింది. గ్రామపంచాయతీ గెజిట్లో కూడా పీజీ తండాగా ప్రచురితమైంది.
Similar News
News January 24, 2025
వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737724894518_18102126-normal-WIFI.webp)
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం సైతం వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. 1048 రకం మిర్చి రూ.12,500, అకిరా బ్యాగడి మిర్చి రూ.13 వేలు పలికింది. అలాగే పాత తేజ మిర్చి ధర రూ.14,000, పాత 341 రకం మిర్చి ధర రూ.15,500, పాత వండర్ హాట్ మిర్చి రూ.14,000, 5531 మిర్చి రూ.12 వేల ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. సూక పల్లికాయ రూ.6,210, పచ్చిపల్లికాయ రూ.4 వేలు పలికాయి.
News January 24, 2025
WGL: మార్కెట్లో మిర్చి ధరల వివరాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737694360077_18102126-normal-WIFI.webp)
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా తేజ మిర్చి ధర నిన్న రూ.14,300 ధర పలకగా.. నేడు రూ.14,000కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ మిర్చికి గురువారం రూ.13,500 ధర రాగా.. నేడు రూ.14,000కి చేరింది. మరోవైపు 341 రకం మిర్చికి గత 2 రోజుల లాగే రూ.15,500 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News January 24, 2025
దరఖాస్తులను వెంటనే ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737646538332_52094030-normal-WIFI.webp)
సంగెం మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాన్ని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులపై వచ్చిన దరఖాస్తులను ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను ఎప్పటికప్పుడు తప్పులు దొర్లకుండా ఆన్లైన్ ఎంట్రీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.