News January 26, 2025
దుద్యాల్: భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తాం: కలెక్టర్

ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణంలో భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షలు, 120 గజాల ప్లాటు ఇచ్చి న్యాయం చేస్తామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో దుద్యాల మండలం లగచర్ల రైతులు కలెక్టర్తో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి రైతుల సమ్మతి లభించిందని కలెక్టర్ తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామన్నారు.
Similar News
News October 22, 2025
ALP: రేపు అలంపూరు ఆలయాల హుండీ లెక్కింపు

అలంపూర్లో వెలసిన జోగులాంబ దేవి, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీ లెక్కింపు రేపు (గురువారం) నిర్వహిస్తున్నట్లు ఈవో దీప్తి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయాల ప్రాంగణంలో ఉదయం 10:00 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. స్వామి అమ్మవారి భక్తులు, పరిసర ప్రాంత భక్తులు హాజరై హుండీ లెక్కింపులో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
News October 22, 2025
RARE PHOTO: ఆకాశంలో అద్భుతం

అత్యంత అరుదుగా కనిపించే రెడ్ స్ప్రైట్స్(ఎర్రటి మెరుపులు) న్యూజిలాండ్లో ఆవిష్కృతమయ్యాయి. NZ ఫొటోగ్రాఫర్ టామ్ రే, స్పానిష్ ఫొటోగ్రాఫర్స్ జఫ్రా, జోస్ సౌత్ ఐలాండ్లో మిల్కీ వే చిత్రాలు తీసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఊహించని దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. తుఫానుల సమయంలో ఆకాశంలో ఏర్పడే ఈ రెడ్ స్ప్రైట్స్ 90KM ఎత్తు వరకు వెళ్తాయి. రెప్పపాటులో కనుమరుగయ్యే ఈ మెరుపులను చిత్రీకరించడం ఎంతో కష్టం.
News October 22, 2025
పాల్వంచ: ఈనెల 24న జాబ్ మేళా..

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. టెక్నీషియన్, ట్రైనీ టెక్నీషియన్ పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ లేదా ఐటీఐ చేసిన వారు అర్హులని చెప్పారు. 18 నుంచి 23 ఏళ్ల లోపు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యా అర్హత పత్రాలతో ఈనెల 24న ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు.