News March 8, 2025

దుద్యాల: ఇప్పటికే రూ. 46.20 కోట్లు అందుకున్న రైతులు !

image

దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లి, రోటిబండ, హకీంపేట, పులిచర్లలో కారిడార్ నిర్మాణం కోసం 233ఎకరాల భూమిని రేవంత్ ప్రభుత్వం సేకరించింది. దీంతో రైతులకు పరిహారంగా మొత్తం రూ.46.20కోట్లు అందించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒకవైపు రైతుల్లో ఆనందం మరోవైపు అధికారులు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. హైకోర్టు స్టే విధించినప్పటికీ శుక్రవారం రోజు అధికారులు మళ్లీ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.

Similar News

News November 24, 2025

వరంగల్: మ్యాట్రిమోనీ సైట్ల పట్ల జాగ్రత్త గురూ..!

image

పెళ్లి సంబంధాల కోసం యువత ఆశ్రయిస్తున్న మ్యాట్రిమోనీ సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లాలోని పర్వతగిరి మండలంలో జరిగిన <<18378333>>ఒక సంఘటన <<>>ఉదాహరణగా తెలియజేస్తోంది. ఇప్పటికే పెళ్లిళ్లు అయినా, పిల్లలు ఉన్నా అవన్నీ దాచిపెట్టి సైట్లలో ప్రొఫైల్ ఫొటోలు పెట్టి పెళ్లి చేసుకొని అమాయకులను దోచేస్తున్నారు. కొన్ని మ్యాట్రిమోనీ సైట్ల నిర్వాహకులు సైతం కమీషన్లకు ఆశపడి పెద్దగా ఎంక్వయిరీ చేయకుండానే సంబంధాలు కుదురుస్తున్నారు.

News November 24, 2025

అల్లూరి జిల్లా వాసులకు GOOD NEWS

image

UPSC స్రివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత కోచింగ్ కోసం అర్హులైన ST అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తునట్లు పాడేరు DD PBK పరిమళ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ST అభ్యర్థులు తమ బయోడేటా, 2 ఫోటోలు, విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్ కార్డ్ ఇతర జిరాక్స్ కాపీలతో ఈనెల 26లోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

News November 24, 2025

సిరిసిల్ల: ప్రజావాణికి 141 దరఖాస్తులు

image

రెవెన్యూ 42, హౌసింగ్ 22, CPO 8, ఉపాధి కల్పన అధికారికి 8, DRDO 7,SDCకి 7, RTO వేములవాడ, DPO, DEOకు 5 చొప్పున, DAOకు 4, నీటి పారుదల శాఖ, ఎక్సైజ్ శాఖ, సెస్‌కు 3 చొప్పున, ఏవో కలెక్టరేట్, బీసీ సంక్షేమ అధికారి, EE PR, DWO, మున్సిపల్ కమిషనర్ SRCLకు 2 చొప్పున, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మత్స్య, మైనారిటీ, DPRO, EDM, ఈఈ R&B MPDO VMLD, YRPT, మున్సిపల్ కమిషనర్ VMLDకు 1 వచ్చాయని అధికారులు తెలిపారు.