News April 16, 2025

దుబాయిలో రామారెడ్డి వాసి మృతి

image

దుబాయ్‌లో వలస కార్మికుడి మృతి చెందాడు. రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌కి చెందిన బట్టు సురేశ్ దుబాయిలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఈ నెల 12న మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దుబాయ్‌‌లో ఉన్న బట్టు శంకర్, నవీన్ ఎంబసీ ద్వారా మాట్లాడి మృతదేహాన్ని బుధవారం రాత్రి స్వగ్రామానికి పంపించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

Similar News

News December 4, 2025

HYD: వెల్డింగ్ ట్రైనింగ్.. సర్టిఫికెట్

image

మాదాపూర్‌ NAC- జాతీయ భవన నిర్మాణ సంస్థలో ఇంటర్నేషనల్ స్కిల్డ్ వర్కర్స్ అప్‌గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. వెల్డింగ్ రంగంలో ఉద్యోగం ఉన్నవారికి 15 రోజులపాటు రూ.15,000 ఫీజుతో శిక్షణ ఇస్తారు. భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తారు. ఉద్యోగం లేనివారికి 3 నెలల వెల్డింగ్ శిక్షణను రూ.14,700 ఫీజుతో అందిస్తారు. వారికి నెలకు రూ.6,000కు భోజనం, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు.

News December 4, 2025

WGL: తొలి విడతలో 52 పంచాయతీలు ఏకగ్రీవం

image

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో 52 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో వరంగల్‌ జిల్లాలో 10 (రాయపర్తి 5, పర్వతగిరి 3, వర్ధన్నపేట 2), ములుగు జిల్లాలో 9, మహబూబాబాద్‌ జిల్లాలో 9, భూపాలపల్లి జిల్లాలో 9, జనగామ జిల్లాలో 10 (రఘునాథపల్లి 5), హనుమకొండ జిల్లాలో 5 పంచాయతీలు ఉన్నాయి.

News December 4, 2025

వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

image

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.