News February 24, 2025
దుబాయ్లో అనకాపల్లి ఎంపీ

దుబాయ్లో పాకిస్థాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తదితరులు గ్రౌండ్కు వెళ్లారు. ఐసీసీ ఛైర్మన్ జైషాతో కలిసి ఆయన మ్యాచ్ను వీక్షించారు. భారత్ ఘన విజయం సాధించడంపై ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. టీమిండియాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విరాట్ సెంచరీ అద్భుతమని కొనియాడారు.
Similar News
News October 28, 2025
IRCTCలో 45 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

IRCTC 45 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 15 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్సైట్: https://irctc.com/
News October 28, 2025
చైతన్యం వస్తుందా? గంజాయిపై యుద్ధమే శరణ్యం

భద్రాద్రి: గంజాయి అనర్థాలపై పోలీసులు పదేపదే అవగాహన కల్పిస్తున్నా, జిల్లాలో అక్రమ రవాణా కొనసాగుతుండటం ఆందోళనకరం. ఎస్పీ పిలుపుతో ‘చైతన్యం-డ్రగ్స్పై యుద్ధం’ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ ప్రయత్నం అభినందనీయమే కానీ, ప్రచారం కన్నా, నిరంతర పర్యవేక్షణ, కఠిన శిక్షలు, విద్యార్థుల్లో లోతైన మానసిక పరివర్తన తీసుకురాగలిగితేనే యువతలో శాశ్వత చైతన్యం వచ్చి, జిల్లా ‘డ్రగ్స్ రహితం’గా మారుతుంది.
News October 28, 2025
కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ స్థలాల్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలంటూ కర్ణాటక ప్రభుత్వమిచ్చిన ఆర్డర్స్పై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, దీని వల్ల పది మంది పార్కులో పార్టీ చేసుకున్నా నేరమే అవుతుందని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. కోర్టు విచారణను NOV 17కు వాయిదా వేసింది. కాగా RSSను కట్టడి చేసేందుకే ప్రభుత్వం ఈ ఆర్డరిచ్చిందని విమర్శలొచ్చాయి.


