News February 24, 2025
దుబాయ్లో అనకాపల్లి ఎంపీ

దుబాయ్లో పాకిస్థాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తదితరులు గ్రౌండ్కు వెళ్లారు. ఐసీసీ ఛైర్మన్ జైషాతో కలిసి ఆయన మ్యాచ్ను వీక్షించారు. భారత్ ఘన విజయం సాధించడంపై ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. టీమిండియాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విరాట్ సెంచరీ అద్భుతమని కొనియాడారు.
Similar News
News March 24, 2025
వనపర్తి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..

వనపర్తి జిల్లాలో ఆదివారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. అత్యధికంగా పెబ్బేరులో 39.8℃ఉష్ణోగ్రత నమోదైంది. కొత్తకొండలో 38.6℃, విలియంకొండ 38.5, శ్రీరంగాపూర్ 38.1, పెద్దమందడి 37.6,వనపర్తి 37.5, అమరచింత 37.4, గోపాల్పేట 37.2, కేతేపల్లి 37.1, మదనాపూర్ 37, ఆత్మకూర్ 36.9, దగడ 36.6,ఘనపూర్ 36.5, రేమద్దుల 36.5, రేవల్లి 36.3, వీపనగండ్ల 36.2, సోలిపూర్, వెల్గొండ 36.1, పాన్గల్లో 35.6℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 24, 2025
జియ్యమ్మవలస: ఏనుగుల గుంపు సంచారం

జియ్యమ్మవలస మండలంలోని ఎరుకుల పేట గ్రామ పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం చెరుకు, అరటి తోటల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉంటూ ప్రయాణం చేయాలన్నారు. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
News March 24, 2025
జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన సంజయ్ కుమార్పై అనర్హత వేటు పడుతుందా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?