News February 14, 2025
దుబాయ్లో సిరిసిల్ల యువకుడు MISSING

దుబాయ్ దేశంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన జెల్లబాల శంకర్(30) ఈనెల 6వ తారీఖున బ్రతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మరుసటి రోజు సోనాపూర్ క్యాంపు నుంచి బయటకు వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. తోటి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.
Similar News
News December 4, 2025
WGL: సోషల్ మీడియానే మొదటి ప్రచార అస్త్రం..!

ఉమ్మడి ఓరుగల్లులో జీపీ ఎన్నికల సందడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. అభ్యర్థులు అభివృద్ధి హామీలతో పోస్టులు షేర్ చేస్తూ, తమ మేనిఫెస్టోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. దేవాలయాలు, రోడ్లు, డ్రైనేజీలు, పింఛన్లు, ఇళ్ల పంపిణీ, శుద్ధి నీటి సమస్యల పరిష్కారం వంటి హామీలతో గ్రామాల్లో చర్చలు రగులుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వీడియోలు, చమత్కార స్లోగన్లు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మీ ప్రాంతాల్లో ఎలా ఉంది.
News December 4, 2025
HYD: వెల్డింగ్ ట్రైనింగ్.. సర్టిఫికెట్

మాదాపూర్ NAC- జాతీయ భవన నిర్మాణ సంస్థలో ఇంటర్నేషనల్ స్కిల్డ్ వర్కర్స్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. వెల్డింగ్ రంగంలో ఉద్యోగం ఉన్నవారికి 15 రోజులపాటు రూ.15,000 ఫీజుతో శిక్షణ ఇస్తారు. భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తారు. ఉద్యోగం లేనివారికి 3 నెలల వెల్డింగ్ శిక్షణను రూ.14,700 ఫీజుతో అందిస్తారు. వారికి నెలకు రూ.6,000కు భోజనం, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు.
News December 4, 2025
WGL: తొలి విడతలో 52 పంచాయతీలు ఏకగ్రీవం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో 52 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో వరంగల్ జిల్లాలో 10 (రాయపర్తి 5, పర్వతగిరి 3, వర్ధన్నపేట 2), ములుగు జిల్లాలో 9, మహబూబాబాద్ జిల్లాలో 9, భూపాలపల్లి జిల్లాలో 9, జనగామ జిల్లాలో 10 (రఘునాథపల్లి 5), హనుమకొండ జిల్లాలో 5 పంచాయతీలు ఉన్నాయి.


