News February 17, 2025

దుబాయ్ నుంచి వచ్చి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన తునికి రాములు(42) అనే వ్యక్తి దుబాయ్ నుంచి వచ్చి నేరుగా మేడిపల్లి శివారులో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శ్యామ్ రాజ్ ఆదివారం తెలిపారు. రాములు 3 నెలల క్రితం దుబాయ్ దేశం వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి దొరకకపోవడంతో నేరుగా మేడిపల్లికి ఆదివారం వెళ్లి గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య తునికి శ్యామల ఫిర్యాదు చేశారు.

Similar News

News January 4, 2026

ఈనెల 9 నుంచి అంతర్ రాష్ట్ర సంక్రాంతి క్రికెట్ కప్

image

రావినూతలలో దశాబ్దాలుగా నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు ఈనెల 9న ప్రారంభం కానున్నట్లు RSCA అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాల నుంచి 16 జట్లు తలపడనున్నాయన్నారు. విజేతలకు వరుసగా రూ.3 లక్షలు, రూ.2 లక్షలు, రూ.1 లక్ష నగదు బహుమతులు అందిస్తామన్నారు. ఈ క్రీడలకు గిరిబాబు హాజరవుతారని సమావేశంలో పాల్గొన్న సినీ నటుడు రఘుబాబు వెల్లడించారు.

News January 4, 2026

వాస్తు ఎందుకు పాటించాలి?

image

వాస్తు పాటించడమంటే గోడలు, దిశలు మార్చడం కాదని గాలి, వెలుతురు వంటి ప్రకృతి శక్తులతో మన జీవితాన్ని అనుసంధానించుకోవడమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి ప్రసరించే ఇంట్లో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. సానుకూల శక్తితో కుటుంబీకుల మధ్య సత్సంబంధాలు బలపడి, ఉన్నతమైన ఆలోచనలను ప్రేరేపిస్తాయి. సమాజంలో గౌరవాన్ని, ఆర్థిక వృద్ధిని అందిస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 4, 2026

అంధకారంలో వెనిజులా.. స్తంభించిన జనజీవనం

image

వెనిజులాపై అమెరికా <<18750335>>వైమానిక దాడుల<<>> తర్వాత ఆ దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. విద్యుత్ గ్రిడ్‌లు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో రాజధాని కరాకస్ సహా ప్రధాన నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఆహారం, అత్యవసర మందుల కోసం ప్రజలు బారులు తీరారు. ఫోన్లు ఛార్జ్ చేసుకోవడానికి ప్రజలు రోడ్లపై పనిచేస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ వద్దకు చేరుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.