News March 22, 2024
దుబ్బాకలో ఒగ్గుపూజారుల గొడవ.. కేసు నమోదు

దుబ్బాక పట్టణంలో రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి ఒగ్గు పూజారులు ఇరు వర్గాలుగా వీడిపోయి దాడి చేసుకున్నారు. ఈ గొడవపై కేసు నమోదు చేసినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. రేకులకుంట, మల్లయ్యపల్లి గ్రామాలకు చెందిన పదకొండు మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో బాధ్యులు, మరికొంత మందిపై చర్యలు తీసుకోనున్నట్లు వివరణ ఇచ్చారు.
Similar News
News December 3, 2025
మెదక్: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కొల్చారం, కౌడిపల్లి, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లోని 183 సర్పంచ్, 1,523 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు
News December 3, 2025
MDK: ఓటర్లను ప్రలోభపెట్టేవారిపై కఠిన చర్యలు: ఎస్పీ

గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా సాగేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, విభేదాలకు దూరంగా ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కొందరిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. నగదు, మద్యం పంపిణీపై కఠిన నిఘా ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు పెట్టవద్దని, యువత కేసుల్లో ఇరుక్కోకూడదని సూచించారు.
News December 3, 2025
MDK: ఓటర్లను ప్రలోభపెట్టేవారిపై కఠిన చర్యలు: ఎస్పీ

గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా సాగేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, విభేదాలకు దూరంగా ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కొందరిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. నగదు, మద్యం పంపిణీపై కఠిన నిఘా ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు పెట్టవద్దని, యువత కేసుల్లో ఇరుక్కోకూడదని సూచించారు.


