News March 22, 2024
దుబ్బాకలో ఒగ్గుపూజారుల గొడవ.. కేసు నమోదు

దుబ్బాక పట్టణంలో రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి ఒగ్గు పూజారులు ఇరు వర్గాలుగా వీడిపోయి దాడి చేసుకున్నారు. ఈ గొడవపై కేసు నమోదు చేసినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. రేకులకుంట, మల్లయ్యపల్లి గ్రామాలకు చెందిన పదకొండు మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో బాధ్యులు, మరికొంత మందిపై చర్యలు తీసుకోనున్నట్లు వివరణ ఇచ్చారు.
Similar News
News November 21, 2025
ఉమ్మడి జిల్లాను వణికిస్తోన్న చలి

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ 9.9, ఝరాసంగం10.6, మెదక్ జిల్లా శివంంపేట11.2, పెద్దశంకరంపేట 12.0, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6, పోతారెడ్డిపేట 11.6, కొండపాకలో 12.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


