News January 28, 2025

దుబ్బాకలో విషాదం..!

image

చేసిన అప్పులు తీర్చలేక, జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లోనే ఉరేసుకొని, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుబ్బాకలో సోమవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాలు.. దుబ్బాక పట్టణానికి చెందిన షేర్వానీ మహేశ్(38), కిరాణా దుకాణంలో పనిచేస్తూ, భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ అవసరాలతో పాటు వ్యక్తిగత అవసరాల నిమిత్తం దాదాపు రెండు లక్షల వరకు అప్పు చేసి, చనిపోయాడు.

Similar News

News September 14, 2025

బెల్లంపల్లి: ‘సారీ మమ్మీ, డాడీ నేను బతకలేను’

image

బెల్లంపల్లి మండలం ఆకెనపల్లికి చెందిన 9వ తరగతి విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్సై రామకృష్ణ ప్రకారం.. సుప్రియ(14)ను తల్లిదండ్రులు రోజు పాఠశాలకు వెళ్లాలని శుక్రవారం మందలించారు. మనస్తాపానికి గురై శనివారం తెల్లవారుజామున ఎలుకల గుళికలను మింగింది. ‘నాకు చదువుకోవాలని లేదు.. సారీ మమ్మీ, డాడీ నేను బతకలేను’ అంటూ వాంతులు చేసుకుంది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.

News September 14, 2025

కేజీ చికెన్ ధర రూ.280.. ఎక్కడంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. TGలోని హైదరాబాద్‌, కామారెడ్డి, ఖమ్మంతో పాటు APలోని విజయవాడ, గుంటూరు, నంద్యాల, పల్నాడు, తూ.గో తదితర నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230-240కి విక్రయిస్తున్నారు. అత్యధికంగా తిరుపతిలో రూ.280, అత్యల్పంగా కాకినాడలో రూ.220-230గా ఉంది. మీ ఏరియాలో రేట్ ఎంత? COMMENT

News September 14, 2025

VJA: లేపాక్షి ప్రదర్శనలో విద్యార్థుల సరికొత్త ఆలోచనలు

image

విజయవాడలోని లేపాక్షి హస్తకళల డిజైన్ పోటీ, మాస్టర్ పీసెస్ ఎగ్జిబిషన్‌లో యువ డిజైనర్ల ఆలోచనలు ప్రతిధ్వనించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది విద్యార్థులు సాంప్రదాయ హస్తకళలను లోతుగా అధ్యయనం చేశారు. టెక్స్‌టైల్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్ వంటి విభాగాల్లో విద్యార్థులు ప్రదర్శనలోని కళాఖండాలను పరిశీలించి, డిజైన్, నాణ్యత, వినియోగం, ప్రజెంటేషన్ అంశాలపై విశ్లేషణ చేశారు.