News January 28, 2025
దుబ్బాకలో విషాదం..!

చేసిన అప్పులు తీర్చలేక, జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లోనే ఉరేసుకొని, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుబ్బాకలో సోమవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాలు.. దుబ్బాక పట్టణానికి చెందిన షేర్వానీ మహేశ్(38), కిరాణా దుకాణంలో పనిచేస్తూ, భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ అవసరాలతో పాటు వ్యక్తిగత అవసరాల నిమిత్తం దాదాపు రెండు లక్షల వరకు అప్పు చేసి, చనిపోయాడు.
Similar News
News December 5, 2025
WGL: కబ్జారాయుళ్లపై నిఘా.. 150 మంది పేర్లతో జాబితా!

ట్రై సిటీలో కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల జాబితాను WGL పోలీసులు తయారు చేసినట్లు తెలిసింది. 360 మంది పేర్లతో కూడిన జాబితాను నిశితంగా పరిశీలించి, వాటి నుంచి 150 పేర్లతో కూడిన ఫైనల్ జాబితాను తయారు చేసి, వారిపై నిఘా పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రధాన నేతలకు సంబంధించిన కొందరు అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ జాబితాను రూపొందించారట.
News December 5, 2025
ఈ వ్యాధితో జాగ్రత్త: సత్యసాయి జిల్లా కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న సందర్భంగా ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ వ్యాధి చిగర్ మైట్స్ అనే సూక్ష్మ పురుగుల కాటుతో వ్యాపిస్తుందని, ప్రారంభ దశలోనే వైద్య చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రారంభదశలో గుర్తిస్తే సులభంగా నయం చేసుకోవచ్చన్నారు.
News December 5, 2025
టిఫా స్కాన్లో ఏం చెక్ చేస్తారంటే?

టిఫా అంటే.. టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్. నిపుణులైన రేడియాలజిస్టులు ఈ స్కాన్ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని స్కాన్ చేస్తారు. శిశువు, ప్లాసెంటా పొజిషన్, ఉమ్మనీరు స్థితి గుర్తిస్తారు. అలాగే తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని బట్టి ప్రసవం ఎలా చెయ్యాలి అనేది కూడా ఈ స్కాన్ ద్వారా నిర్ణయిస్తారు. కాబట్టి ఈ స్కాన్ కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు నిపుణులు.


