News January 28, 2025
దుబ్బాకలో విషాదం..!

చేసిన అప్పులు తీర్చలేక, జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లోనే ఉరేసుకొని, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుబ్బాకలో సోమవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాలు.. దుబ్బాక పట్టణానికి చెందిన షేర్వానీ మహేశ్(38), కిరాణా దుకాణంలో పనిచేస్తూ, భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ అవసరాలతో పాటు వ్యక్తిగత అవసరాల నిమిత్తం దాదాపు రెండు లక్షల వరకు అప్పు చేసి, చనిపోయాడు.
Similar News
News November 26, 2025
ఫలించిన మంత్రి బీసీ కృషి.. సీఎం ఆమోదం

మంత్రి జనార్దన్ రెడ్డి కృషి ఫలించింది. నియోజకవర్గ ప్రజల ఆంకాక్ష నెరవేరింది. బనగానపల్లెను రెవెన్యూడివిజన్ చేయాలని మంత్రి పలుసార్లు CM దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. నియోజకరవ్గ ముఖ్యంగా సంజామల, కోవెలకుంట్ల, అవుకు మండలాల ప్రజలు నిరసన తెలిపారు. పనుల నిమిత్తం డోన్ డివిజన్ కేంద్రానికి వెళ్లాలంటే దూరంతో పాటు చాలా బస్సులు మారాల్సి వస్తుందని వాపోయారు. ఎట్టకేలకు బనగనపల్లె రెవెన్యూ డివిజన్ కానుంది.
News November 26, 2025
లోకేశ్.. ఇది పబ్లిసిటీ స్టంట్: YCP

AP: రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల పేరుతో <<18388550>>వ్యక్తిగత దాడులు వద్దంటూ<<>> మంత్రి లోకేశ్ చెప్పడం ఒక పబ్లిసిటీ స్టంట్ అని YCP విమర్శించింది. ‘మీరు, మీ తండ్రి ఆన్లైన్ క్యారెక్టర్ అసాసినేషన్ కల్చర్కు స్పాన్సర్లు. HYD నుంచి పెయిడ్ ట్రోల్స్ నడిపిస్తారు. జగన్&ఫ్యామిలీని ఎన్నో ఏళ్లుగా అవమానిస్తున్నారు. ముందు మీ నుంచి మార్పు మొదలెట్టండి’ అంటూ గతంలో YCP నేతలను కూటమి సపోర్టర్స్ విమర్శించిన వీడియోలను షేర్ చేసింది.
News November 26, 2025
MDK: ఎన్నికలకు మోగిన నగర.. అంత మీ చేతుల్లోనే

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆశావాహులు ఇప్పటికే గ్రామాల్లో వరసలు కలుపుకుంటూ.. బంధాలను పెంపొందించుకుంటున్నారు. మూడు విడతల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశవాహులు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మద్దతు దారులను వారు వెంటే ఉంచుకుంటున్నారు. మీ ప్రాంతంలో ఏలా ఉంది. కామెంట్ చేయండి.


