News May 19, 2024

దుబ్బాక: అప్పులు చేసి ఆన్‌లైన్‌ గేమ్స్‌

image

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో యువత ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలకు తీరని మనోవ్యధకు మిగులుస్తోంది. ఈ విషపు క్రీడ గ్రామాల్లోకి పాకింది. గ్రామీణ యువకులు కూడా ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌లు కాస్తూ అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో నెలకు సుమారు 15 వరకు ఆత్మహత్యల కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో సుమారు 22 శాతం మంది యువత ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసలవుతున్నట్లు ఇటీవల జరిగిన ఓ సర్వేలో తేలింది.

Similar News

News November 3, 2025

మెదక్: ప్రజావాణిలో 77 దరఖాస్తులు

image

మెదక్ కలెక్టరెట్‌లోని ప్రజావాణిలో మొత్తం 77 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. వీటిల్లో భూ సమస్యలకు సంబంధించి 36, పింఛన్లకు సంబంధించి 07, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 07, దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగిలిన 27 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News November 3, 2025

మెదక్: చేవెళ్ల ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి

image

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. పేషెంట్ల కండీషన్‌ను డాక్టర్లు మంత్రికి వివరించారు. ఒక్కరికి మాత్రమే హెడ్ ఇంజురీ కాగా, ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. అందరికీ మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. వైద్య ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. బాధితులతో మాట్లాడిన మంత్రి దామోదర్ రాజనర్సింహ ధైర్యం చెప్పారు.

News November 3, 2025

మెదక్: రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

image

ఈ నెల 3 నుంచి 30 వరకు మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.