News April 11, 2025
దుబ్బాక: ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక మండలం రాజక్క పేటలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన బోయ మోహన్ (48)రేకులకుంట ఆలయంలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆలయ సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News October 29, 2025
హిందూపురం ఘటనకు కల్తీ కల్లే కారణం: వైసీపీ

హిందూపురంలో 10 మంది అస్వస్థతకు గురవడానికి కారణం కల్తీ కల్లేననని <<18143030>>వైసీపీ<<>> ఆరోపించింది. ‘ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తాగి జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. అది చాలదన్నట్లు హిందూపురంలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. చంద్రబాబు చేతగానితనంతో రాష్ట్రంలో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో’ అని ట్వీట్ చేసింది.
News October 29, 2025
గద్వాల్ జిల్లాలో ఎల్లుండి రన్ ఫర్ యూనిటీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి(జాతీయ ఐక్యత దినోత్సవం) పురస్కరించుకుని ఎల్లుండి శుక్రవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా ఉంచాలని పట్టుబట్టి సంస్థానాలను విలీనంలో కీలకపాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర యువత మరిచిపోకూడదు అన్నారు.
News October 29, 2025
రష్యా దూకుడు.. ఈ సారి అండర్ వాటర్ డ్రోన్ ప్రయోగం

అణుశక్తితో నడిచే మరో ఆయుధాన్ని రష్యా ప్రయోగించింది. అండర్ వాటర్ డ్రోన్ ‘Poseidon’ను టెస్ట్ చేసినట్లు ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇది న్యూక్లియర్ పవర్ యూనిట్ అమర్చిన మానవరహిత వెహికల్ అని తెలిపారు. ఆ డ్రోన్ను ఇంటర్సెప్ట్ చేసే మార్గమే లేదని చెప్పారు. వారం రోజుల వ్యవధిలో రష్యా నిర్వహించిన రెండో పరీక్ష ఇది. ఇటీవల న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ <<18109096>>మిసైల్ <<>>Burevestnikను ప్రయోగించడం తెలిసిందే.


