News March 10, 2025

దుబ్బాక: కుమార్తెను చూసేందుకు వెళ్తూ తండ్రి మృతి

image

రోడ్డు ప్రమాదంలో <<15703438>>యువకుడు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. కూతురు పుట్టిందన్న సంతోషంలో వెళ్తున్న యువకుడి మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసుల వివరాలిలా.. పోతారం వాసి నరేశ్(28)కు నెల క్రితం కూతురు పుట్టింది. కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌లోని అత్తగారింట్లో ఉన్న భార్య, పాపను తీసుకురావడానికి ఆదివారం బైక్‌పై వెళ్తున్నాడు. ఆకారం శివారులో ఆటో ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. ఘటనపై కేసు నమోదైంది.

Similar News

News November 27, 2025

జనగామ: నేడు మొదటి విడత జీపీ ఎన్నికల నామినేషన్లు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లను ఈరోజు ఉ.10 నుంచి సా.5 గం.ల వరకు అధికారులు స్వీకరించనున్నారు. మొదటి విడతలో జనగామ జిల్లాలో చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, లింగాల ఘనపూర్, జఫర్గడ్ మండలంలోని 110 గ్రామపంచాయతీలు, 1024 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

News November 27, 2025

రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

image

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.

News November 27, 2025

జనగామ: మొదలైన సర్పంచ్ ఎన్నికల సమరం!

image

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జనగామ జిల్లాలోని ఆయా పార్టీల వారు ఎన్నికల సమరం మొదలుపెట్టారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థులను ఎన్నుకునే ప్రక్రియలో పడ్డారు. నిన్నటి నుంచి మొదలైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలు రెండు, మూడు రోజుల్లో క్లియర్ అయ్యే వాతావరణం గ్రామాల్లో కనిపిస్తుంది. కాగా, రిజర్వేషన్ తారుమారు అవడంతో పార్టీ నేతలకు అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారింది.