News March 22, 2025

దుమ్ముగూడెం: జ్వరంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

image

దుమ్ముగూడెం మండలంలోని నారాయణరావుపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్న సోయం సుకుమార్ (11) శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుకుమార్‌కు జ్వరం రావడంతో ఈనెల 15న తల్లిదండ్రులు హాస్టల్ నుంచి ఇంటికి తీసుకువచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. 17న సాయంత్రం జ్వరం తీవ్రత పెరిగి పిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News November 28, 2025

పశ్చిమ గోదావరిలో కొత్త ట్రెండ్.. క్లిక్ కొడితే కోడి ఇంటికే!

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. పండుగకు ముందే పందెం పుంజుల విక్రయాల్లో నూతన ఒరవడి కనిపిస్తోంది. సాంకేతికతను వినియోగించుకుంటూ విక్రయదారులు ఆన్‌లైన్‌ వేదికగా కోళ్లను అమ్మకానికి పెడుతున్నారు. రంగు, జాతితో పాటు వాటి జాతక వివరాలను సైతం పొందుపరుస్తుండటం విశేషం. రూ.వేల నుంచి లక్షల్లో ధర పలుకుతున్న ‘డిజిటల్’ పుంజుల అమ్మకాలు ఆసక్తికరంగా మారాయి. క్లిక్ కొడితే కోడి ఇంటికే వచ్చేస్తోంది.

News November 28, 2025

సిద్దిపేట: “హైదరాబాద్ రైజింగ్” లక్ష్యం: మంత్రి

image

తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంకేతికత, సంస్కృతి, ఆవిష్కరణలతో శాశ్వత సంబంధాలను నెలకొల్పేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. 2047 నాటికి తెలంగాణ “హైదరాబాద్ రైజింగ్” లక్ష్యంతో సురక్షితమైన నగరంగా మారుతుంది అన్నారు. యువత, మహిళలు, రైతులను శక్తిమంతం చేసేందుకు మానవ మూలధనంపై పెట్టుబడులు పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News November 28, 2025

VKB: కారు బైక్, ఢీ.. ఒకరి మృతి

image

నవాబుపేట మండలం, మైతాబ్ ఖాన్ గూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న మోమిన్‌పేట మండలం, దేవరపల్లికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు కూడా అదే గ్రామానికి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు ఆరా తీస్తున్నారు.