News April 16, 2025

దుమ్ముగూడెం: మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు

image

ఆదివాసీ యువజన సంఘం పేరుతో మంగళవారం దుమ్ముగూడెం మండలంలో పలుచోట్ల కరపత్రాలు వెలిశాయి. గోవిందపురం, పెద్ద బండి రేవు, చిన్ననలబల్లి, ములకపాడు, లక్ష్మీనగరం ప్రధాన సెంటర్లలో వెలసిన కరపత్రాలలో గిరిజనులకు ఆధారమైన అడవిలోకి వెళ్లకుండా మావోయిస్టులు బాంబులు అమర్చడం సరైన పద్ధతి కాదని ఎంతకాలం ఈ అరాచకాలు, మమ్మల్ని అభివృద్ధి చెందనివ్వరా అంటూ ప్రశ్నిస్తూ కరపత్రాలలో పేర్కొన్నారు.

Similar News

News October 21, 2025

పాలమూరు: వీరులకు వందనం.. మిమ్మల్ని మరవం!

image

శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన SP జి.పరదేశి నాయుడు బృందం త్యాగం చిరస్మరణీయం. 1993లో సోమశిల వద్ద PWG ఘటనా స్థలాన్ని పరిశీలించి తిరిగి వస్తున్న బస్సును సుద్దగట్టు వద్ద పేల్చివేసిన నక్సల్స్‌, మొత్తం 10 మందిని పొట్టనబెట్టుకున్నారు. SPతో పాటు 2SIలు, 2HCలు, 5PCలు, డ్రైవర్ షాలి పాషా అమరులయ్యారు. వారి వీరత్వానికి, చూపిన తెగువకు జిల్లా శిరస్సు వంచి నమస్కరిస్తోంది.
#నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

News October 21, 2025

కృష్ణా: జోగి రమేష్ అరెస్ట్ ఆలస్యం.. అందుకేనా..?

image

కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ తప్పదని వార్తలు వచ్చాయి. తనను అరెస్టు చేస్తే గౌడ సామాజిక వర్గం మొత్తం రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తుందని జోగి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాపుల తర్వాత గౌడ వర్గీయుల సంఖ్య అధికంగా ఉంది. అరెస్టు చేస్తే బలమైన BC సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందేమో అని కూటమి సందేహిస్తున్నట్లు తెలుస్తుంది.

News October 21, 2025

భగవద్గీతను ఎవరెందుకు చదవాలి?

image

మానవులందరికీ మార్గదర్శనం చేసే దివ్య గ్రంథం భగవద్గీత. ఉత్తమ జీవితం కోసం ప్రతి ఒక్కరూ గీతను అధ్యయనం చేయాలి. విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువకులు సరైన జీవన విధానం కోసం, వృద్ధులు మరణానంతర ఆలోచనల కోసం, అజ్ఞానులు జ్ఞానం కోసం, ధనవంతులు దయ అలవరుచుకోవడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, కష్టాల్లో ఉన్నవారు పరిష్కారం కోసం భగవద్గీతను చదవాలి.
* రోజూ ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> క్లిక్ చేయండి.