News February 12, 2025
దుమ్ముగూడెం ముత్యాలమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

దుమ్ముగూడెం గ్రామంలో తరతరాలుగా వెలిసిన గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి 23వ ముగింపు జాతర ఉత్సవాలకు మంగళవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి అమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పట్టుచీరతో అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో పాటు అభిషేకాలు, పుష్పాలంకరణ, కుంకుమ పూజ వంటి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
Similar News
News November 27, 2025
కామారెడ్డి జిల్లాలో స్థిరంగా చలి ప్రభావం

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రత 13°C లుగా నమోదవుతుంది. జిల్లావ్యాప్తంగా గడిచిన 24గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. బీబీపేట 13.8°C, జుక్కల్ 14.6, రామలక్ష్మణపల్లి, బొమ్మన్ దేవిపల్లి, గాంధారి 14.9, నస్రుల్లాబాద్, లచ్చపేట 15.1, రామారెడ్డి 15.2, డోంగ్లి, ఎల్పుగొండ 15.3°C లుగా రికార్డ్ అయ్యాయి.
News November 27, 2025
NLG: రైతు పత్తికే వంక!… రైతన్నల అవస్థలు

దళారుల చేతుల్లో పత్తి మిల్లులు ఉండటంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొండమల్లెపల్లి, కట్టంగూరు, చండూరు మండలాల పరిధిలోని జిన్నింగ్ మిల్లులలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మిల్లుకు తెచ్చిన పత్తిని ఎలాంటి వంకలు పెట్టకుండా కొనుగోలు చేస్తున్నారని, రైతులు తెచ్చిన పత్తికి నానా వంకలు పెడుతున్నారని తెలిపారు.
News November 27, 2025
SPF నుంచి వేములవాడకు అదనపు సిబ్బంది

అభివృద్ధి పనులు జరుగుతున్న వేములవాడ క్షేత్రానికి అదనపు భద్రత కల్పించారు. ఇందుకోసం SPF విభాగం నుంచి అదనంగా 12 మంది సిబ్బందిని కేటాయించారు. ప్రస్తుతం ఒక ASI, ఇద్దరు HCలు, 10 మంది కానిస్టేబుల్స్ భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. భీమేశ్వరాలయంలో దర్శనాలు ప్రారంభం కావడం, భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అదనంగా మరో ఇద్దరు HCలు, 10 మంది కానిస్టేబుల్స్ను పంపారు. నేటి నుంచి వీరు విధుల్లో చేరనున్నారు.


