News February 12, 2025
దుమ్ముగూడెం ముత్యాలమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

దుమ్ముగూడెం గ్రామంలో తరతరాలుగా వెలిసిన గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి 23వ ముగింపు జాతర ఉత్సవాలకు మంగళవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి అమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పట్టుచీరతో అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో పాటు అభిషేకాలు, పుష్పాలంకరణ, కుంకుమ పూజ వంటి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
Similar News
News November 16, 2025
మన్యం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షునిగా సంజీవరావు

పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా కార్యదర్శి జివిఆర్ కిషోర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కే.సంజీవరావు, జనరల్ సెక్రటరీగా జి.చంద్రమౌళి, వైస్ ప్రెసిడెంట్గా డబ్ల్యూవిఎస్ఎస్ శర్మ, ట్రెజరీగా వి.మౌనిక, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి.కళ్యాణిదుర్గ ఎన్నికయ్యారు.
News November 16, 2025
టెట్ ఫలితాల విడుదల అప్పుడే: విద్యాశాఖ

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 03 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 10-16వ తేదీ మధ్య వెల్లడిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు కూడా జనరల్ కోటా మాదిరిగానే మార్కులు సాధించాల్సి ఉంటుందని పేర్కొంది.
News November 16, 2025
250 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 250 గ్రూప్-B పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్ 2023/24/25 స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 30 ఏళ్లు మించరాదు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.99,000 వరకు ఉంటుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
వెబ్సైట్: https://cabsec.gov.in/


