News February 15, 2025
దుర్గి: దాడి కేసులో నిందితుడి అరెస్టు

వ్యక్తిపై దాడి కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ సుధీర్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. దుర్గి మండలం తేరాలకు చెందిన వీరయ్యపై 2000 సంవత్సరంలో శీలం సిద్ధయ్య, వెంకటేశ్వర్లు దాడి చేసి గాయపరిచారన్నారు. ఆ సమయంలో సిద్ధయ్య, వెంకటేశ్వర్లుపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. కేసు విచారణలో ఉండగా సిద్ధయ్య కోర్టుకు హాజరుకాకుండా పారిపోయాడన్నారు.
Similar News
News December 7, 2025
మహిళను హత్య చేసిన విజయనగరం వాసి

పెందుర్తిలోని సుజాతనగర్లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి, విజయనగరానికి చెందిన శ్రీనివాస్ సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల శ్రీనివాస్ రైస్ పుల్లింగ్ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.
News December 7, 2025
2.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: జేసీ

జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని జిల్లాలో మొత్తం 287 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేపట్టడం జరిగిందని జేసీ నవీన్ తెలిపారు. గత ఏడాది ఇదే రోజుకి 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2,46,473 మెట్రిక్ టన్నులు RSKల ద్వారా సేకరించినట్లు తెలిపారు. మొత్తం 29,668 మంది రైతుల నుంచి ధాన్యాన్ని కొని 48 గంటల్లో నగదు జమ చేశామన్నారు.
News December 7, 2025
జనగామ: ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: DCP

జనగామ జిల్లాలో మూడు విడతలుగా జరగబోయే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని DCP రాజమహేంద్రనాయక్ తెలిపారు. ఈ సందర్భంగా DCP మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు, ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్పై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.


