News April 10, 2024
దువ్వాడ మీదుగా ప్రత్యేక రైలు

హైదరాబాద్-కటక్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారి ఏ.కె త్రిపాఠి తెలిపారు. 07165 నంబర్ గల హైదరాబాద్-కటక్ ప్రత్యేక రైలు ఏప్రిల్ 16,23,30 తేదీల్లో ప్రతి మంగళవారం రాత్రి 8:10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9.05 దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 9.07 బయలుదేరి సాయంత్రం 5.45 కటక్ చేరుకుంటుంది. కటక్లో 17,24, మే1న 07166 నంబర్ గల రైలు అందుబాటులో ఉంటుందన్నారు.
Similar News
News December 4, 2025
జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.
News December 4, 2025
వాల్తేరు డివిజన్లో రైళ్ల రాకపోకలు నిలిపివేత

గరివిడి-సిగడం-చీపురుపల్లి సెక్షన్లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజనల్ కార్యాలయం బుధవారం తెలిపింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో విశాఖ-పలాస మెము (67289/67290), విశాఖ-బ్రహ్మపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ (18525/18526) సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.
News December 4, 2025
వాల్తేరు డివిజన్లో రైళ్ల రాకపోకలు నిలిపివేత

గరివిడి-సిగడం-చీపురుపల్లి సెక్షన్లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజనల్ కార్యాలయం బుధవారం తెలిపింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో విశాఖ-పలాస మెము (67289/67290), విశాఖ-బ్రహ్మపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ (18525/18526) సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.


