News April 10, 2024

దువ్వాడ మీదుగా ప్రత్యేక రైలు

image

హైదరాబాద్-కటక్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారి ఏ.కె త్రిపాఠి తెలిపారు. 07165 నంబర్ గల హైదరాబాద్-కటక్ ప్రత్యేక రైలు ఏప్రిల్ 16,23,30 తేదీల్లో ప్రతి మంగళవారం రాత్రి 8:10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9.05 దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 9.07 బయలుదేరి సాయంత్రం 5.45 కటక్ చేరుకుంటుంది. కటక్‌లో 17,24, మే1న 07166 నంబర్ గల రైలు అందుబాటులో ఉంటుందన్నారు.

Similar News

News March 21, 2025

ఓవర్ హీట్: విశాఖ జూలో ఉపసమన చర్యలు

image

వేసవి ఉష్ణోగ్రతలు మండుతున్న నేపథ్యంలో జూలో వన్యప్రాణులు ఎండ వేడిమి తిట్టించుకునేందుకు జూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చింపాంజీలు, టైగర్స్, లయన్, జీబ్రా, జిరాఫీలు, ఎలిఫెంట్స్, వివిధ రకాల పక్షులు మొదలైన వాటికి ఎండవేడిమి తట్టుకునేలా, వాటర్ స్ప్రింకలర్స్ ఏర్పాటు చేశారు. లోపల ఫ్యాన్లు, ఎయిర్ కండిషన్లు, కస్ కస్ మ్యాట్లు, తాటాకు పందిర్లు పెట్టారు. వేడి నుంచి ఉపశమనం కలిగేందుకు ఇవి దోహదపడుతున్నాయి.

News March 21, 2025

విశాఖ – భద్రాచలం ప్రత్యేక బస్సులు

image

శ్రీరామ నవమి సందర్భంగా విశాఖపట్నం నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 6 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయని ఆయన తెలిపారు. భక్తుల కోరిక మేరకు ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ నుంచి రాజమండ్రి మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు.

News March 21, 2025

విశాఖలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలో ఇంటర్ విద్యార్థి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. GRP పోలీసుల వివరాల ప్రకారం.. కంచరపాలెంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న అంబటి రేవంత్ కుమార్‌ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షలు సరిగా రాయలేదంటూ మనస్తాపం చెందాడు. ఈక్రమంలోనే బుధవారం అర్ధరాత్రి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!