News August 13, 2024
దువ్వూరు: కన్నీళ్లు పెట్టించే ఫొటో

దువ్వూరు వద్ద కేసీ కెనాల్లో నిన్న ఓ ఎండ్ల బడి పడి ఓ <<13835710>>ఎద్దు<<>> చనిపోయిన విషయం తెలిసిందే. సంబంధిత ఫొటోలు అందరినీ కలచివేస్తున్నాయి. రైతులు భూమిని, తమ పాడి పశువులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాటికి ఏ మాత్రం నష్టం వచ్చినా తట్టుకోలేరు. అలాంటిది అన్ని రోజులు తమకు అండగా ఉన్న ఓ ఎద్దు కళ్ల ముందు చనిపోవడంతో విషాదంలో మునిగిపోయారు. ఎద్దు కళేబరం వద్ద బోరున ఏడ్చారు. సంబంధిత ఫొటో వైరల్ అవుతోంది.
Similar News
News November 25, 2025
ప్రొద్దుటూరులో జువెలరీ దుకాణం మూత..! బాధితుల గగ్గోలు

ప్రొద్దుటూరులోని తనకంటి జ్యూవెలరీ దుకాణం మూడు రోజులుగా మూత పడింది. దాంతో బంగారు సరఫరాదారులు, ఆభరణాలకు అడ్వాన్స్ ఇచ్చిన వారు, స్కీముల్లో, చీటిల్లో డబ్బులు కట్టిన వారంతా ఆందోళన చెందుతున్నారు. డబ్బులు కట్టినవారికి జీఎస్టీ రసీదులివ్వకుండా, చీటీలు రాసి ఇవ్వడంతో బాధితులు గగ్గోలు చెందుతున్నారు. వ్యాపారి శ్రీనివాసులును చీటింగ్, కిడ్నాప్, దాడి కేసుల్లో పోలీసులు విచారణ చేస్తుండడంతో ఆందోళన పడుతున్నారు.
News November 25, 2025
కడప జిల్లా హెడ్ క్వార్టర్కు ప్రొద్దుటూరు సీఐ..!

ప్రొద్దుటూరు 1టౌన్ సీఐ తిమ్మారెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించి అక్కడ రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. బంగారు వ్యాపారి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామిపై డబ్బు ఎగవేత, చీటింగ్, కిడ్నాప్ ఫిర్యాదులున్నాయి. ఈ కేసుల్లో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ తిమ్మారెడ్డి విచారణ చేపట్టారు. విచారణ తీరుపై సీఐపై ఆరోపణలొచ్చి ఆయనను హెడ్ క్వార్టర్కి పంపినట్లు సమాచారం.
News November 25, 2025
విజేతలుగా కడప జిల్లా టీంలు

పులివెందులలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతో గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.


