News August 26, 2024

దువ్వూరు: చికిత్స పొందుతూ చిన్నారి మృతి

image

దువ్వూరు మండలం చింతకుంట గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు కొత్తపేటకు చెందిన భగత్ సింగ్ తన కూతురు కియాన్ సింగ్ పుట్టు వెంట్రుకలకు తిరుమలకు కారులో 9 మంది బయలుదేరారు. చింతకుంట వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడటంతో గాయపడ్డారు. మైదుకూరు ఆసుపత్రిలో నాగలక్ష్మి(70), భగత్ సింగ్(35), ప్రొద్దుటూరు ఆస్పత్రిలో కియాన్ సింగ్(9 నెలలు) చికిత్స పొందుతూ చనిపోయారు.

Similar News

News February 24, 2026

కడప: మొదటి రోజు పరీక్షలకు 748 మంది గైర్హాజరు

image

కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు వచ్చారు.

News February 24, 2026

వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

image

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.

News February 24, 2026

వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

image

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.