News July 13, 2024
దువ్వూరు: బ్రహ్మ సాగర్లో అడుగంటిన జలం

దువ్వూరు మండలం చల్లబసాయ పల్లె గ్రామం వద్ద ఉన్న బ్రహ్మ సాగర్ ఎస్సార్ 1లో నీరు అడుగంటింది. జలాశయంలో ప్రస్తుతం అట్టడుగునా నీరు ఉంది. జులై నెల రెండు వారాలు పూర్తయినప్పటికీ వర్షాల జాడ కనిపించడం లేదని రైతులు చెప్తున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రిజర్వాయర్లో నీరు అందుబాటులో ఉంటే పంటలు సాగు చేసుకోవచ్చని ఏడాది ఆరుతడి పంటలకే పరిమితం కావలసి వస్తుందని రైతులు వాపోతున్నారు.
Similar News
News February 16, 2025
ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి: కడప ఎస్పీ

జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. కడపలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు సిబ్బందికి పలు కీలకమైన సూచనలు చేశారు. అంతకుముందు శిక్షణా కేంద్రంలో ఆయన మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
News February 15, 2025
ప్రొద్దుటూరు: బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు

ప్రొద్దుటూరు స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ గోవింద్ రెడ్డి తెలిపారు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలికకు మాయ మాటలు చెప్పిన నల్లబోతుల కుల్లాయప్పపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
News February 15, 2025
కడప: రూ.700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?

మోదీజీ.. ఢిల్లీలో బీజేపీ కార్యాలయ నిర్మాణానికి రూ.700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలరా అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి డిమాండ్ చేశారు. కమలాపురంలో ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు నిధులు తేవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి కృషి చేయడం లేదని విమర్శించారు.