News January 27, 2025

దువ్వూరు హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా 

image

కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల వివరాల ప్రకారం, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి దువ్వూరు ఎస్‌ఐ వినోద్, పోలీసులు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 13, 2025

కడప: హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన

image

బైక్ నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు కడప జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ ధారణపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బైక్ నడిపే సమయంలో ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు.

News February 12, 2025

14న కడపకు మాజీ సీఎం జగన్ రాక

image

ఈనెల 14న కడప నగరానికి మాజీ సీఎం వైఎస్ జగన్ రానున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహానికి జగన్ హాజరవుతున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి కడపకు చేరుకొని వివాహ వేడుకల్లో పాల్గొని అనంతరం జగన్ నేరుగా బెంగళూరుకు వెళ్తారని పార్టీ నాయకులు వెల్లడించారు.

News February 12, 2025

కడప: టెన్త్ అర్హతతో 72 ఉద్యోగాలు

image

కడప డివిజన్‌లో 40, ప్రొద్దుటూరు డివిజన్‌‌లో 32 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

error: Content is protected !!