News January 27, 2025

దుశ్చర్లకు గవర్నర్ పురస్కారం

image

జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ గౌడ్‌కు పర్యావరణ విభాగంలో గవర్నర్ ప్రతిభా పురస్కారాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందించారు. కాగా దుశ్చర్ల మోతె మండలం రాఘవాపురంలో తనకున్న 70 ఎకరాల భూమిలో అడవిని సృష్టించాడు. దుశ్చర్లకు అవార్డు రావడం పట్ల ప్రకృతి ప్రేమికులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 4, 2025

ఇల్లందుకు బొగ్గుగడ్డగా పేరేలావచ్చిందంటే!

image

1870లో ఇల్లందులో బొగ్గు నిల్వలు బయటపడ్డాయి. అప్పటి నుంచి స్థానికులు ఇల్లందును ‘బొగ్గుగడ్డ’గా పిలుస్తుంటారు. భద్రాద్రి రామయ్య భక్తుడి కారణంగా నల్ల బంగారం వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఎడ్లబండిపై రాములోరి గుడికి వెళ్తూ రాత్రి సమయంలో సింగరేణి, పూసనపల్లి సమీపంలో వంట కోసం అక్కడ నల్లటి రాళ్లను పొయ్యిగా అమర్చారు. రాళ్లు నిప్పు కణికలుగా మారడం, ఎంతకీ ఆరకపోవడంతో దక్కన్ కంపెనీ నిల్వలను గుర్తించింది.

News November 4, 2025

కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా..!

image

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మొత్తం 14 మందికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. కామారెడ్డి PS పరిధిలో ఓ వ్యక్తికి ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. మరో 9 మందికి రూ.9 వేలు జరిమానాలు వేశారు. దేవునిపల్లి పరిధిలో ముగ్గురికి రూ.3 వేల చొప్పున జరిమానా, బీబీపేట్ పరిధిలోని ఓ వ్యక్తికి రూ.వెయ్యి జరిమానాలు విధించింది.

News November 4, 2025

నేటి నుంచి బుగులోని వెంకన్న జాతర ప్రారంభం

image

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో ఎడ్ల బండ్లపైన చేరుకుంటారు. నేడు స్వామివారిని మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా కొండ వద్దకు తీసుకుస్తారు. దీంతో జాతర వైభవం లాంఛనంగా ప్రారంభం కానుంది.