News January 27, 2025

దుశ్చర్లకు గవర్నర్ పురస్కారం

image

జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ గౌడ్‌కు పర్యావరణ విభాగంలో గవర్నర్ ప్రతిభా పురస్కారాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందించారు. కాగా దుశ్చర్ల మోతె మండలం రాఘవాపురంలో తనకున్న 70 ఎకరాల భూమిలో అడవిని సృష్టించాడు. దుశ్చర్లకు అవార్డు రావడం పట్ల ప్రకృతి ప్రేమికులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 16, 2025

వేరుశనగ పంట కోత.. ఇలా చేస్తే మేలు

image

వేరుశనగ పంటలో 75 నుంచి 80 శాతం కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే పంటను కోయాలి. పంటకోత కొరకు డిగ్గర్ యంత్రాన్ని, మొక్క నుంచి కాయలను వేరుచేయటానికి త్రైషర్ యంత్రాన్ని ఉపయోగిస్తే మంచిది. త్రైషర్ ద్వారా ఒక గంటకు 2 నుంచి 2 1/2 క్వింటాళ్ల కాయలను మొక్కల నుంచి వేరుచేయవచ్చు. ఇలా కూలీల కొరతను అధిగమించవచ్చు. కోత తర్వాత కాయలను బాగా ఆరబెట్టాలి. కాయల్లో తేమ ఎక్కువ లేకుండా చూసుకోవాలి.

News November 16, 2025

తిరుపతిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

తిరుపతి బ్లిస్ హోటల్ పక్కన ఉన్న రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రుయా మార్చురీకి మృతదేహాన్ని తరలించారు.

News November 16, 2025

NTR: నేడు వైసీపీలోకి రంగా వారసురాలు.?

image

దివంగత నేత వంగవీటి రంగా కుమార్తె ఆశ కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. నేటి ఉదయం బందర్ రోడ్డులోని రంగా విగ్రహానికి నివాళులర్పించి కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రంగా కుమార్తె ఆశ కిరణ్ అన్నది కూడా చాలా మందికి తెలియదు. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమె వంగవీటి రాధా ఉన్న పార్టీలో కాకుండా మరో పార్టీలో చేరే అవకాశం ఉందని, YCPలో చేరే ఛాన్స్ ఉందని చర్చ నడుస్తోంది.