News January 27, 2025
దుశ్చర్లకు గవర్నర్ పురస్కారం

జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ గౌడ్కు పర్యావరణ విభాగంలో గవర్నర్ ప్రతిభా పురస్కారాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందించారు. కాగా దుశ్చర్ల మోతె మండలం రాఘవాపురంలో తనకున్న 70 ఎకరాల భూమిలో అడవిని సృష్టించాడు. దుశ్చర్లకు అవార్డు రావడం పట్ల ప్రకృతి ప్రేమికులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 15, 2025
జూబ్లీహిల్స్: స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అందులో 29 మంది స్వతంత్రులు ఉన్నారు. పోటీ చేసిన వారిలో 10 మందికి పైగా నిరుద్యోగులున్నారు. వారంతా రెండంకెల ఓట్లకే పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608. బరిలో నిలిచిన వారిలో 41 మంది అభ్యర్థులకు రెండంకెల ఓట్లు, ఒక స్వతంత్ర అభ్యర్థికి 9 ఓట్లు పోలయ్యాయి.
News November 15, 2025
సిరిసిల్ల: రాజీవ్ యువ వికాసం కోసం ఎదురుచూపులు

సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకున్న యువతకు నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు మొత్తం 7,680 యూనిట్లు కేటాయించగా, 7,121 మంది అర్హులను ఎంపిక చేశారు. వీరికి స్వయం ఉపాధి కోసం రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించారు. ఆరు నెలలు గడుస్తున్నా రుణం అందకపోవడంతో యువతలో నిరాశ నెలకొంది.
News November 15, 2025
ములుగు: నెక్స్ట్ దామోదరేనా..!?

జిల్లాకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత తక్కల్లపల్లి వాసుదేవరావు @ ఆశన్న ఇటీవల లొంగిపోయారు. తాజాగా రాష్ట్ర నేత కొయ్యడ సాంబయ్య @ఆజాద్ పోలీసులకు పట్టుబడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ములుగులో మిగిలింది బడే చొక్కారావు @దామోదర్ ఒక్కరే. రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన చాలాకాలంగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్లో పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.


