News March 28, 2025
దెందులూరు: ఆటో బైక్ ఢీ.. ఒకరు మృతి

దెందులూరులో శుక్రవారం సాయంత్రం వాహనం ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో దెందులూరు గ్రామానికి చెందిన కొల్లాబత్తిన ఏసు (35) అక్కడికక్కడే మృతి చెందాడు. గుంపుల వంశీకి తీవ్రగాయాలయ్యాయి. ఏసు, వంశీ బైక్పై దెందులూరు నుంచి రైల్వే గేట్ వైపు వెళ్తున్నారు. ఆటో దెందులూరు వైపు వస్తుంది. మూడు తూరలు మలుపు వద్ద రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దెందులూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 3, 2025
సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం కలెక్టర్!

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సోమవారం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల అర్జీల పరిష్కారం అనంతరం సంబంధిత దరఖాస్తు దారుడుకి అధికారులు స్వయంగా ఫోన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారి నుంచి అభిప్రాయాలను స్వీకరించాలని, అలాగే అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తించాలన్నారు.
News November 3, 2025
THDCలో 40 ఉద్యోగాలు

తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్(THDC) 40 అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BSc, బీటెక్, BE, MBBS అర్హతగల అభ్యర్థులు NOV 7 నుంచి DEC 6వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.600. SC, ST, PWBDలకు ఫీజు లేదు. స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://thdc.co.in
News November 3, 2025
డిజిటల్ అరెస్టుల పేరిట ₹3వేల కోట్ల లూటీ

దేశంలో డిజిటల్ అరెస్టుల పేరిట ₹3వేల కోట్ల లూటీ జరిగిందని హోమ్ శాఖ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ స్కామ్ ఛాలెంజింగ్గా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరముందని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్, JM బాగ్చి అభిప్రాయపడ్డారు. దీనిపై త్వరలోనే ఆదేశాలిస్తామన్నారు. కాగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మోసాలపై విచారణ బాధ్యతను CBIకి అప్పగించాలని కోర్టు భావిస్తోంది.


