News January 27, 2025

దెందులూరు: మృతుల వివరాల గుర్తింపు

image

దెందులూరు మండలం పోతునూరు పరిధిలో హైవేపై ట్రాక్టర్‌ను కంటైనర్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. మృతులు ఉండి మండలం ఉప్పులూరుకు చెందిన  డొల్లా జోషి(40), బోడా చందు(22)గా గుర్తించారు. ఇదే ప్రమాదంలో ఈలి సన్నీ అనే వ్యక్తి, కంటైనర్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ట్రాక్టరు ఏలూరు నుంచి ఉప్పులూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

Similar News

News November 27, 2025

వరంగల్: పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు

image

సెప్టెంబర్‌లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌తోపాటు ఇటీవల నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంలో అత్యధిక కేసులను రాజీమార్గంలో ముగించినందుకు కృషి చేసిన పోలీస్ అధికారులను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు అభినందించారు. ఈ మేరకు ఆయన చేతుల మీదుగా వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ప్రశంసాపత్రాలను అందజేశారు.

News November 27, 2025

టీమ్‌ ఇండియా సెలక్షన్‌పై CV ఆనంద్ అసంతృప్తి

image

భారత క్రికెట్‌ పరిస్థితిపై TG హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో భారత్‌లో ప్రత్యర్థులు గెలవడం అరుదుగా జరిగేదని.. ప్రస్తుతం భారత ప్లేయర్లు స్వదేశంలోనే స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రంజీలు ఆడకపోవడం, IPL ఆధారంగా సెలక్షన్ జరగడం దీనికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. రంజీ‌లో రాణిస్తున్న ఆటగాళ్లను పక్కనబెట్టడం సెలక్షన్‌లో పక్షపాతానికి నిదర్శనమన్నారు.

News November 27, 2025

మంచిర్యాల: రైతుల ఖాతాలలో నగదు జమ

image

జిల్లాలో 2025-26సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలో నగదు జమ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఇటిక్యాలలో మెప్మా, గుల్లకోట కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతుల ఖాతాలలో నగదు జమ అయిందన్నారు.