News March 8, 2025
దేమకేతేపల్లిలో ఈ-క్రాప్ చెకింగ్

చిలమత్తూరు మండల పరిధిలోని దేమకేతేపల్లిలో రైతు అంజినప్పకు చెందిన వరి పంటను గతంలో వ్యవసాయ శాఖ అధికారులు ఈ క్రాప్ బుకింగ్ చేశారు. ఆ పొలంలో వరి పంటను జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ శుక్రవారం సూపర్ చెక్ చేశారు. ఈ సందర్భంగా రైతులు వరి పంటను మరింత విస్తృత పరిచే విధంగా చైతన్య పరచాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అనంతరం రైతు అంజినప్ప రాగి పంట సాగుపై చర్చించారు. ఏడిఏ అల్తాఫ్ ఆలీఖాన్ ఉన్నారు.
Similar News
News November 26, 2025
GWL: ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ మందిరంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పరస్పర సహకారంతో అధికారులు పనిచేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు.
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.
News November 26, 2025
రాజమండ్రి రూరల్: దేశభక్తిని చాటిన విద్యార్థులు

రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని కలెక్టరేట్లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, భారత స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనలు సాగాయి. సంప్రదాయ భారతీయ కళ, సాహిత్య సోయగాలు ప్రతిఫలించిన ఈ కార్యక్రమాలు దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేశాయి.


