News March 12, 2025

దేవాదాయ శాఖలోకి కాశీనాయన ఆశ్రమం..?

image

కాశీనాయన ఆశ్రమంలో కూల్చివేతలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ‘ఆశ్రమం అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ శాఖ నిబంధనలు సంక్లిష్టంగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆ శాఖ అధికారులు నిర్మాణాలను కూల్చివేశారు. కాశీనాయన ఆశ్రమాన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలని ఆదినారాయణ రెడ్డితో పాటు ఇతర MLAల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. సీఎంతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటాం’ అని ఆనం ప్రకటించారు.

Similar News

News March 13, 2025

కడప: ‘మౌలిక సదుపాయాలు కల్పించాలి’

image

కడప జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వం నిర్మించిన జగనన్న కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప నగర శివారులోని జగనన్న కాలనీలను ఆయన ఈరోజు పరిశీలించారు. కనీసం ప్రజలు తాగేందుకు నీటి సదుపాయం కూడా లేకపోవడం నిజంగా దారుణం అన్నారు. రోడ్లు డ్రైనేజీ నీటి సదుపాయం కల్పించాలని కోరారు.

News March 13, 2025

10th పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 17వ తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు కడప జిల్లా కలెక్టర్‌ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. అమరావతి నుంచి సీఎస్ విజయానంద్ కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వర్చువల్‌గా సమీక్షించారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు ఎస్పీ పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.

News March 12, 2025

వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో కడప జిల్లా ఎమ్మెల్సీలు

image

తాడేపల్లెలో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అధినేత జగన్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ లక్ష్యాలను ఆయన వివరించారు. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా పార్టీ పెట్టినట్లు చెప్పారు. వైసీపీ వెన్నంటే నిలిచిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా ఎమ్మెల్సీలు రమేశ్ యాదవ్, రామ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 

error: Content is protected !!