News March 23, 2025
దేవాదుల పంప్ హౌస్ను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు

హసన్పర్తి మండలంలోని దేవన్నపేట గ్రామంలో గల దేవాదుల పంప్ హౌస్ను ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు సందర్శించి మోటార్లను పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలోనే దేవాదుల నుంచి రైతులకు నీరు అందిందని.. ఈ కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు ను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.
Similar News
News March 31, 2025
సన్రైజర్స్తో చర్చలకు సిద్ధం: HCA

సన్రైజర్స్ జట్టుతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ‘మాకు కేటాయించిన వాటికి మించి అదనపు పాసుల్ని ఎప్పుడూ అడగలేదు. అసోసియేషన్ పరువుకు భంగం కలిగించే పద్ధతి మంచిది కాదు. మ్యాచ్లను సక్సెస్ఫుల్గా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే మౌనం పాటిస్తున్నాం. ఏదేమైనా సన్రైజర్స్ యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపాయి.
News March 31, 2025
ఎల్లుండే లోక్సభలోకి వక్ఫ్ సవరణ బిల్లు?

వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దానికి ముందే బీజేపీ సీనియర్ నేతలు ఇండీ కూటమి నేతలతో సమావేశమై చర్చించొచ్చని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4న ముగియనున్నాయి. ఆలోపుగా ఉభయ సభలూ ఆమోదిస్తేనే బిల్లు చట్టరూపం దాల్చుతుంది.
News March 31, 2025
అనకాపల్లి జిల్లాలో 40.9 డిగ్రీల ఉష్టోగ్రత

అనకాపల్లి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు సోమవారం కాస్త శాంతించాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పరిమితమయ్యాయి. సోమవారం మాడుగులలో 40.9డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది. 3 మండలాల్లో తీవ్రవడగాలులు, 15 మండలాల్లో వడగాలుల వీచాయి. వేసవిలో అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.