News March 29, 2024

దేవినేని ఉమాకు వసంత బర్త్‌డే విషెస్

image

మైలవరం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దేవినేని ఉమాకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బర్త్ డే విషెస్ తెలిపారు. మైలవరం టికెట్ ఉమా ఆశించగా.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంతకే అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉండి విమర్శలు చేసుకున్న ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా ఎదురుపడిన దాఖలాలు లేవు. ఈక్రమంలో ఉమాకు వసంత విషెస్ చెప్పడం గమనార్హం.

Similar News

News November 15, 2025

మచిలీపట్నం GGHలో అవినీతి మరకలు..?

image

మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రి అవినీతికి అడ్డాగా మారుతోందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారని రోగుల బంధువులు చెబుతున్నారు. ఇదేకాక శిక్షణ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థుల నుంచి సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో కూడా కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నాయి.

News November 15, 2025

మచిలీపట్నం GGHలో అవినీతి మరకలు..?

image

మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రి అవినీతికి అడ్డాగా మారుతోందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారని రోగుల బంధువులు చెబుతున్నారు. ఇదేకాక శిక్షణ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థుల నుంచి సర్టిఫికేట్లు ఇచ్చే విషయంలో కూడా కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నాయి.

News November 15, 2025

కృష్ణా: కలెక్టరేట్‌లో చెత్తాచెదారం తొలగించిన కలెక్టర్

image

స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టరేట్ ఉద్యోగులు శ్రమదానం చేశారు. కలెక్టర్ డీకే బాలాజీతోపాటు వివిధ శాఖ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది శ్రమదానంలో పాల్గొన్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.