News June 6, 2024

దేవీపట్నం: నడిరోడ్డుపై తల్లి, బిడ్డను వదిలేశారు

image

దేవీపట్నం మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన గర్భిణి జోగమ్మ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ప్రసవించింది. వైద్యసేవల అనంతరం తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్ వాహనంలో ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి బయలుదేరగా.. మార్గమధ్యలో అకూరు గ్రామం వద్ద రోడ్డుపై వదిలి వెళ్లిపోయారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.500 చెల్లించి ఆటోపై ఆమె చింతలగూడెం గ్రామానికి వెళ్లారు.

Similar News

News December 6, 2025

తూ.గో.: 76 శాతం ‘ఖరీఫ్‌’ కోతలు పూర్తి

image

తూ.గో. జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 76.42 శాతం కోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) ఎస్. మాధవరావు తెలిపారు. మొత్తం 81,406 హెక్టార్లకు గాను, ఇప్పటివరకు 62,217 హెక్టార్లలో పంట కోతలు పూర్తయ్యాయి. మరో వారం, పది రోజుల్లో వరి కోతలు వంద శాతం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News December 6, 2025

రాజమండ్రి: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

నన్నయ విశ్వవిద్యాలయం రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలోని పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్స్ ఈ నెల 8 నుండి 12వ తేదీ వరకు రాజమండ్రి క్యాంపస్‌లో నిర్వహిస్తున్నామని వీసీ ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శనివారం వర్సిటీలో ఈ వివరాలు వెల్లడించారు. ఎం.ఏ., ఎం.కామ్, ఎం.పీ.ఈడీ, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్‌కు ఈ అడ్మిషన్స్ ఉంటాయని వీసీ పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

News December 6, 2025

10 లోపు సంతకాల సేకరణ పూర్తి చేయాలి: చెల్లుబోయిన

image

కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి ఈ నెల 10వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేయాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆదేశించారు. అనంతరం 13వ తేదీన వాటిని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. బొమ్మూరు పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి అధ్యక్షతన శనివారం నిర్వహించిన గూగుల్ మీట్ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.