News March 19, 2025

దేవీపట్నం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

దేవీపట్నం మండలంలోని రోడ్డు ప్రమాదంలో ఓ యవకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ షరీఫ్ తెలిపిన వివరాలు మేరకు.. పెద్ద నూతులకు చెందిన సూర్యప్రకాశ్ రెడ్డి, రామిరెడ్డి‌తో కలసి బైక్‌పై మంటూరు వెళ్లారు. దారికి అడ్డంగా పశువుల రావడంతో బైక్ అదుపు తప్పి పడ్డారు. క్షతగాత్రులను స్థానికులు రంప ఆసుపత్రిలో చేర్చగా సూర్యప్రకాశ్ చికిత్స పొందుతూ మంగళవారి రాత్రి మృతి చెందాడని వైద్యులు తెలిపారని చెప్పారు. 

Similar News

News November 11, 2025

ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదు.. సమయస్ఫూర్తి!

image

ఢిల్లీలో పేలుడును ఇంటెలిజెన్స్ ముందే పసిగట్టలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ దేశంలో 2వారాలుగా ఉగ్ర అనుమానితుల అరెస్టులు చూస్తే ఓ రకంగా అప్రమత్తమైన నిఘాతోనే దుర్ఘటన తీవ్రత తగ్గిందని చెప్పొచ్చు. ఫరీదాబాద్‌లో JK పోలీసులు నిన్న భారీ పేలుడు పదార్థాలతో ముగ్గురిని పట్టుకున్నారు. దీంతో ఆ టీమ్‌కు చెందిన డా.ఉమర్ తన వద్ద గల మెటీరియల్‌తో బ్లాస్ట్ చేశాడు. నిఘా నిద్రపోతే అంతా కలిసి భారీ నరమేథం సృష్టించేవారేమో!

News November 11, 2025

ప్రకాశం: పెద్ద చెర్లోపల్లికి చేరుకున్న సీఎం

image

ఇవాళ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పెద్ద చెర్లోపల్లి మండలం ఇర్లపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ ఇన్‌ఛార్జులు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభాస్థలికి చేరకున్నారు.

News November 11, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6,830

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర నేడు రూ.6,830 అయింది. రూ.7 వేలకు పైగా ధర పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో తేమలేని పత్తి మార్కెట్‌కు తీసుకురావాలని సూచిస్తున్నారు.