News July 26, 2024
దేవుడి భూములను ఆక్రమించేశారు అధ్యక్షా..!: గౌరు చరితరెడ్డి

ఓర్వకల్లు మండలం శకునాలలోని కాశీ విశ్వేశ్వరస్వామి గుడి భూములను YCP నేతలు ఆక్రమించుకుని మట్టిని తవ్వేసుకున్నారని పాణ్యం MLA గౌరు చరతరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలోని దేవాలయాలు దూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోని పరిస్థితి ఉంది. మాదవాంజనేయ గుడికి ఉన్న 180 ఎకరాలు రిఎల్ ఎస్టేట్ కోసం ఆక్రమించుకున్నారు. వీటిపై కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలి అధ్యక్షా..’ అని అన్నారు.
Similar News
News December 10, 2025
100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.


