News April 5, 2025
దేశంలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం: మంత్రి ఉత్తమ్

ఆహార భద్రత విషయంలో దేశంలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో సన్న బియ్యం లబ్ధిదారులు పాలడుగు వెంకటయ్య నివాసాన్ని సందర్శించి వారితో కలిసి భోజనం చేసి మాట్లాడారు. సన్నబియ్యం పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలందరికీ మేలు జరుగుతుందని, గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.
Similar News
News December 22, 2025
19ఏళ్ల వయసుకే 36 మెడల్స్

తమిళనాడులోని హోసూర్కు చెందిన నిత్య శ్రీ సుమతి శివన్ పారా బ్యాడ్మింటన్లో వరుస మెడల్స్ గెలుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. 2005 జనవరి 7న జన్మించిన ఆమె పారిస్ 2024 పారాలింపిక్స్లో మహిళల సింగిల్స్ SH6 విభాగంలో కాంస్యం, 2022 ఆసియన్ పారా గేమ్స్లో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్లో 3 కాంస్య పతకాలు సాధించారు. ఆమె చేసిన విశేష సేవలకు గాను 2024లో అర్జున అవార్డు అందుకున్నారు.
News December 22, 2025
కేసీఆర్కు కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్!

TG: ఇక ప్రభుత్వంపై ఉద్యమం చేస్తానంటూ బీఆర్ఎస్ చీఫ్ <<18633627>>KCR<<>> ప్రకటనతో కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వ నేతలు సిద్ధమయ్యారు. నిన్న సీఎం <<18634773>>రేవంత్<<>>, మంత్రి ఉత్తమ్ బదులివ్వగా ఇవాళ మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా 8 నెలల విరామం తర్వాత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి.
News December 22, 2025
విశాఖ: హెల్మెట్ లేదా? ‘అయితే పెట్రోల్ లేదు’

విశాఖలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ‘నో హెల్మెట్ – నో ఫ్యూయల్’ (No Helmet – No Fuel) విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ కే.ప్రవీణ్ కుమార్ చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోస్తారని స్పష్టం చేశారు. వాహనదారుల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.


