News March 4, 2025

దేశం కోసం ప్రకాశం జిల్లా వాసి ప్రయత్నం!

image

ఒక నినాదం కోసం వేల మైళ్లు సైకిల్ యాత్ర చేపట్టాడు ప్రకాశం జిల్లా వాసి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంటూ రుద్రవారం వాసి సుభాశ్ చంద్రబోస్ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఏకంగా 50 వేల కి.మీ యాత్రలో భాగంగా 28 రాష్ట్రాలను చుట్టేశాడు. 41,223 కి.మీ సైకిల్ తొక్కి విశాఖ చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన చొరవతో రాష్ట్రపతికి ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ అందజేయడం తన లక్ష్యమంటున్నాడీ కుర్రాడు.

Similar News

News March 5, 2025

ప్రకాశం: APAMT ఒలింపియాడ్‌లో కీర్తి ప్రతిభ

image

కొండేపిలో బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థిని పి.కీర్తి APAMT మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ -2024లో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించినట్లు ప్రిన్స్‌పల్ ఎస్.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబర్ 30న 51వ రాష్ట్ర అసోషియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ అధ్వర్యంలో నిర్వహించగా గతవారం విడుదల చేసిన ఫలితాల్లో మొదటి స్థానం సాధించినట్లు చెప్పారు. కీర్తిని ఈసందర్భంగా ఉపాధ్యాయులు అభినందించారు.

News March 4, 2025

దేశం కోసం ప్రకాశం జిల్లా వాసి ప్రయత్నం!

image

ఒక నినాదం కోసం వేల మైళ్లు సైకిల్ యాత్ర చేపట్టాడు ప్రకాశం జిల్లా వాసి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంటూ రుద్రవరం వాసి సుభాశ్ చంద్రబోస్ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఏకంగా 50 వేల కి.మీ యాత్రలో భాగంగా 28 రాష్ట్రాలను చుట్టేశాడు. 41,223 కి.మీ సైకిల్ తొక్కి విశాఖ చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన చొరవతో రాష్ట్రపతికి ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ అందజేయడం తన లక్ష్యమంటున్నాడీ కుర్రాడు.

News March 4, 2025

రాచర్ల: వృద్ధురాలికి షాక్ ఇచ్చిన కరెంట్ బిల్.!

image

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగూటిపల్లికి చెందిన పూల వెంకటమ్మ అనే వృద్ధురాలికి కరెంట్ బిల్ షాక్ ఇచ్చింది. ఇంట్లో కేవలం 3 ఫ్యాన్లు, ఓ ఫ్రిడ్జ్, ఓ TV ఉండగా ఏకంగా రూ.10,580 బిల్లు రావడంతో ఆమె అవాక్కయ్యారు. ఫిబ్రవరి నెలలో వారం రోజులపాటు అసలు ఊరిలోనే లేనని, అయినా ఇంత కరెంట్ బిల్లు ఎలా వచ్చిందో తెలియలేదని ఆమె తెలిపారు. గతంలో కూడా మీటర్ సాంకేతిక లోపంతో లక్ష వరకు కరెంట్ బిల్ వచ్చిందని వెల్లడించించారు.

error: Content is protected !!