News April 25, 2024
దేశానికే ఆదర్శం మన పాలమూరు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో పాలమూరు నేలకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బిజినేపల్లి కాంగ్రెస్ సభలో రేవంత్ మాట్లాడుతూ.. ‘దేశానికే ఆదర్శవంతమైన నేతలను ఇచ్చిన గడ్డ మన పాలమూరు. 70ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇక్కడి బిడ్డకు దక్కింది. గతంలో కరీంనగర్లో ఓటమి భయంతోనే KCR పాలమూరు MPగా పోటీ చేశారు. KCRకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే RS ప్రవీణ్ కాంగ్రెస్లోకి వస్తే ప్రభుత్వం డీజీపీగా నియమించేది’ అని అన్నారు.
Similar News
News January 19, 2025
మహబూబ్నగర్లో అసాంఘిక కార్యకలాపాలు?
మహబూబ్ నగర్ పట్టణంలోని గడియారం చౌరస్తాలో పట్టపగలే చీకటి పనులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చౌరస్తాలో చుట్టూ బ్యానర్లు ఉండటంతో, పలువురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పుడుతున్నట్లు సోషల్మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. జనసంచారం ఉన్న ప్రాంతంలోనే ఇలా బరితెగించారని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేయాలని మహబూబ్నగర్ ప్రజలు కోరారు.
News January 19, 2025
MBNR: ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ సమీక్ష
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 26న ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు సమగ్ర పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. రైతు భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయి పరిశీలనపై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
News January 19, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!
✔ఉమ్మడి జిల్లాల్లో జోరుగా వరి సాగు
✔అయిజ:BRS కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరిక
✔అచ్చంపేట:మూడు కార్లు ఢీ.. ఒకరు మృతి
✔ఘనంగా Sr. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
✔ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష
✔అచ్చంపేట:కత్తితో దాడి.. వ్యక్తికి తీవ్రగాయాలు
✔NGKL: ఉమామహేశ్వర స్వామికి నంది వాహన సేవ
✔డ్రంక్ అండ్ డ్రైవ్..పోలీసుల తనిఖీలు
✔రాష్ట్ర మహా సభల వాల్ పోస్టర్ విడుదల
✔క్రీడా బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యేలు