News July 4, 2024

దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ పవన్ పూజలు

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాధికాలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగా గురువారం సూర్యారాధన చేశారు. దీక్షాబద్ధులైన పవన్ ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు.

Similar News

News December 19, 2025

గుంటూరు జిల్లా విద్యాశాఖలో క్రమశిక్షణ చర్యలు

image

గుంటూరు జిల్లాలో హెచ్‌ఎం/స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలలో భాగంగా అప్పటి డీఈఓగా పనిచేసిన గంగాభవానితో పాటు మరో ఏడుగురు అధికారులపై విచారణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) రూల్స్-1991లోని రూల్ నంబర్ 20 ప్రకారం విచారణ నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.

News December 19, 2025

రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి నారా లోకేశ్

image

మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఆయన స్వీకరించనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో లోకేశ్ భేటీ కానున్నారు. పార్టీ వ్యవహారాలు, ప్రజా సమస్యలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.

News December 19, 2025

గుంటూరులో గంజాయి అక్రమ రవాణా.. ఐదుగురి అరెస్ట్

image

గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేసి, 1.20కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్రాడిపేట ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి, నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన CI ఆరోగ్యరాజు, SI క్రిష్ణ బాజీ బాబు, సిబ్బందిని వెస్ట్ DSP అరవింద్ అభినందించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు.