News July 4, 2024
దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ పవన్ పూజలు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాధికాలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగా గురువారం సూర్యారాధన చేశారు. దీక్షాబద్ధులైన పవన్ ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు.
Similar News
News December 23, 2025
GNT: డీజీపీ కమెండేషన్ డిస్క్లకు ఎంపికైన పోలీస్ అధికారులు

ఏపీ పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన పోలీస్ అధికారులకు 2025 సంవత్సరానికి గాను డీజీపీ కమెండేషన్ డిస్క్లను ప్రకటించారు. ఈ అవార్డులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ విభాగాల్లో అందజేస్తారు. సిల్వర్ డిస్క్ విభాగంలో ASP(అడ్మిన్) జి. వెంకట రమణ మూర్తి, తాడికొండ సీఐ కె. వాసు, చేబ్రోలు పోలీస్ ఏఎస్సై–(2260) యు. శ్రీనివాసరావు ఎంపికయ్యారు. అటు బ్రాంజ్ మెడల్ విభాగంలో మరో 20 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు.
News December 22, 2025
వక్ఫ్ భూముల్లో హద్దుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో వక్ఫ్ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి హద్దులు ఏర్పాటుకు వక్ఫ్ బోర్డు, సర్వే, రెవిన్యూ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ వక్ఫ్ భూములను నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం సర్వే జరిగేలా చూడాలన్నారు.
News December 22, 2025
వినియోగదారుల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్

జాతీయ వినియోగదారుల వారోత్సవాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు జాతీయ వినియోగదారుల వారోత్సవాలు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. ఆహార పదార్థాల ప్యాకింగ్, వివిధ రంగుల్లో ఉండే గుర్తులను ఎలా గమనించాలి, ఏ విధమైన చర్యలు చేపట్టాలి అనే వాటిపై అవగాహన కల్పించాలని తెలిపారు.


