News February 7, 2025

దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

image

ఏలూరులోని నగల దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన<<15384948>> దొంగలను<<>> పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు అంతర్‌రాష్ట్ర ముఠాగా గుర్తించిన పోలీసులు వారు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు తెలిసి అక్కడకు వెళ్లారు. వారి గ్రామాల సమీపంలో మాటు వేసి పట్టుకున్నారు. నిందితులపై ఏలూరు పరిధిలో దాదాపు 10 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News February 23, 2026

బంజారాహిల్స్‌‌లో ర్యాపిడో బైక్‌ను ఢీ కొట్టిన ట్యాంకర్.. ఇద్దరి మృతి

image

బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ర్యాపిడో బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న రైడర్ (హోంగార్డ్), అతని వెనక కూర్చున్న యువతి అక్కడికక్కడే మృతి చెందారు. యువతిని పిక్ చేసుకున్న కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

News February 23, 2026

225 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>ESI <<>>కార్పొరేషన్‌లో 225 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి గడువును పెంచారు. మార్చి 3వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. UPSC నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2024కు సంబంధించి ప్రతిభా సేతు పోర్టల్ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పే స్కేల్ రూ.56,100-రూ.1,77,500 ఉంది. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 23, 2026

దుక్కి సమస్య నేలల్లో బాగా మొలక రావాలంటే?

image

మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పంటలకు అనువుగా దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇక్కడ వరి తర్వాత ఆరుతడి పంటలు వేయడానికి భూమిని దున్నగానే పెళ్లలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పంట సరిగా మొలకెత్తదు. ఇలాంటి సమస్య ఉన్న భూముల్లో మొదట మాములుగా నాగళ్లతో దున్నిన తర్వాత ట్రాక్టరుతో నడిచే రోటవేటర్ (లేదా) పళ్లదంతెతో దున్నితే పెద్ద పెళ్లలు పగిలి అనువైన దుక్కి వస్తుంది.