News April 29, 2024
దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారు: బాజిరెడ్డి

బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని నిజామాబాద్ BRS అభ్యర్థి గోవర్ధన్ అన్నారు. ఆదివారం రాత్రి మోర్తాడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మోదీ నిరుపేదలకు పంచుతానన్న నల్లధనం ఎటుపోయిందని ప్రశ్నించారు. దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని, రేవంత్ రెడ్డి ఝూటాకోర్ అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఆశీర్వదించి మెజారిటీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు.
Similar News
News February 28, 2026
నవీపేట్: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
News February 28, 2026
నవీపేట్: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
News February 28, 2026
నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.


